Finger Millet : రాగిపంట సాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ
Finger Millet : ఆరోగ్య రిత్యా చిరుధాన్యాల వాడకం పెరగటంతో వాటి సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరుధాన్యాల సాగుకు పూర్వవైభం వస్తుంది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగి విస్తీర్ణం ఇటీవలికాలంలో పెరుగుతుంది. రాగి, వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో రాగికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ పంటసాగువైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. రాగిని తేలిక రకం ఇసుక నేలలయందు మరియు బరువు నెలల్లో పండించవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవికావు. రాగి సాగులో వచ్చే చీడపీడలు, తెగుళ్ళ విషయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటిస్తే మంచి నాణ్యతతోపాటు, దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది.
రాగిసాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ ;
తెగుళ్ళు ;
1.అగ్గి తెగులు ; ఈ తెగులు నారుమడితోపాటు పంటను ఆశిస్తుంది. వర్షపు జల్లులు పడుతూ గలిల్లో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ చేరుకున్నపుడు అగ్గితెగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. ఎదిగిన మొక్కల ఆకులు,కణుపులు, వెన్నులపైన దారపుకండే ఆకారంలో మచాలు ఏర్పడతాయి.ఈ మచ్చల చుట్టూ ఎరుపు గోధుమరంగు అంచులు కలిగి ఉంటాయి . కనుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం , వెన్ను పై ఆశిస్తే గింజలు తాలు గింజలుగా మారుతాయి. దీని నివారణకు పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఎందుకంటే కలుపు మొక్కల ద్వారా ఈ తెగులు పంటనాసిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులును తట్టుకునే విత్తన రాకలను ఎన్నుకోవాలి. మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినపుడు లీటరు నీటికి 1 గ్రా. కర్బండిజిమ్ లేదా 3 మీ.లీ. కిటాజన్ మందు వాడకూడదు . నారునాటే ముందు బ్లైటాక్స్ లేదా మంకోజేబ్ మందును 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుల్లనుండి కాపాడుకోవచ్చు. వెదజల్లి విత్తేపద్దతిలో 3 గ్రా. తైరం లేదా కాప్టాన్ కిలో వితననికి కలిపి శుద్ధి చేయాలి.
2. ఆకుమాడుతెగులు ; లేత మొక్కల వేర్లు, మొదళ్ళపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకులపై చిన్న అండకారపు లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఆకులు ఎండుతాయి . దీని నివారణకు తైరం లేదా కాప్టాన్ 3 గ్రా . కిలో విత్తనానికి కలిపి విత్తనాశుద్ది చేయాలి. మంకోజేబ్ 2.5 గ్రా . లీటరు నీటికి కలిపి పైరుకి పిచికారి చేయాలి.
చీడపీడలు ;
1.గులాబి రంగు పురుగు : ఈ పురుగు సజ్జ,జొన్న,కొర్ర పంటలను కూడ ఆశిస్తుంది. ఈ పురుగు ముందు రెక్కలు ఎండుగడ్డి రంగులో వుంటాయి.వెనుక రెక్కలు తెల్లగా ఉంటాయి . బాగా ఎదిగిన లర్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి .లార్వాలు కాండాన్ని తొలిచిసొరంగాలు చేసి లోపలి భాగాలను తినడం వలన మొక్క చనిపోతుంది . పంటను కంకి దశలో ఆశిస్తే అవి తెల్ల కంకులుగా మారుతాయి .ఈ లార్వా పురుగులు ఒక మొక్క నుండి యింకొక మొక్కకు పాకి నష్టపరుస్థాయి . దీని నివారణకు ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఎరివేయాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయడం. ద్వారా వీటివల్ల కలిగే నష్టం తగ్గుతుంది.అవసరాన్ని బట్టి ఒకటి,రెండు శాతం మొక్కల్లో పురుగు ఆసిన్చినపుడు లీటరు నీటికి ఎండోసల్ప్హన్ 2మీ.లీ.కలిపి పిచికారి చేయాలి.
2.శనగ పచ్చ పురుగు : ఇది రాగి పంటని కంకి దశలో ఆశించి పూత,గింజలను తిని నష్టపరుస్తుంది. నివారణకు పురుగు ఆసించినపుడు కంకులను దులిపి లేదా చేతితో ఎరివేసి నాశనం చేయాలి. లీటరు నీటికి 2 మీ.లీ. ఎండోసల్ప్హన్ లేదా 3 గ్రా కార్బరిల్ 50 శాతం పొడి మందు పిచికారి చేయాలి.
3.చెదలు : రాగి,కొర్ర పంటలను చెదలు ఎక్కువగా ఆశించి నష్టపరుస్థాయి . తేలిక నేలలో , వర్షాభావ పరిస్తితిలో ఈ పంటను పండించినప్పుడు చెదలు ఎక్కువగా నష్టం కలుగజేస్తాయి . వీటి నివారణకు పంటల చుట్టూ అక్కడక్కడ ఎత్తుగా కనిపించే పుట్టను నాశనం చేయాలి. ఆ పుట్టల పై భాగంలో రంధ్రం చేసి లీటరు నీటికి 5 మీ.లీ. చొప్పున క్లోరిపైరిఫాన్ మందును కలిపి ఒక్కొక్క పుట్టలో 10 – 12 లీటర్ల మందు ద్రావణం పోయడం ద్వారా చెదలను నివారించవచ్చు. ఈ చెదలు ఎక్కువగా నష్టపరిచే ప్రాంతాల్లో పంటలు వేసే ముందు ఆఖరి దుక్కిలో లిండెన్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున భూమిపై చల్లి కలియదున్నాలి.
4.పేనుబంక: పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం గమనించవచ్చు. దీని నివారణకు డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
COMMENTS