భారతదేశంలో ఉన్న 5 రహస్య నిధుల గురించి తెలుసుకుందాం
Let us know about 5 secret treasures in India: ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికి చాలా ప్రదేశాల్లో దాగివున్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
1. నదీర్ షా నిధి:
నదీర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739 వ సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చి టన్నుల కొద్దీ బంగారాన్ని,వజ్రాలను దోచుకున్నాడు. వీటినన్నిటిని తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీవాహనాలలో తన దేశానికీ తరలిస్తుండగా దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నదీర్ షా ను చంపి అక్కడి నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తరువాత ఈ నిధి మొత్తాన్ని హిందూకుష్ పర్వతాల మధ్యలో దాచి ఉంచాడు. ఆ తరువాత కొన్నిసంవత్సరాల తరువాత అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అప్పటినుంచి ఆ నిధి పర్వతాల మధ్యలో అక్కడే ఉండిపోయింది. ఇప్పటికి ఈ నిధి ఎవ్వరికీ దొరకలేదు.
2. అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధి :
కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని భూగర్భాల్లో ఆరు గదులున్నాయి. వీటిలో రెండు గదులను కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011 వ సంవత్సరంలో ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ గదిలో సుమారు 1,40,000 కోట్లు విలువచేసే నిధి దొరికింది. రెండవ గది మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. ఈ గదిలో కొన్నికోట్ల విలువచేసే రెట్టింపు నిధులుంటాయని భావిస్తున్నారు.
3. చార్మినార్ సొరంగ మార్గం :
చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగ మార్గాన్ని కుతుబ్ షా కట్టించి ఉంటారని భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయట పడటానికి ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదుల్లో నిధులున్నాయని చాలా మంది భావిస్తున్నారు.
4. గ్రోస్వెనోర్ షిప్ (Grosvenor Ship) :
బ్రిటీష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలో భారీ నిధి (బంగారం మరియు వజ్రాలు) చెన్నై(మద్రాసు) నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకువెళ్ళేటప్పుడు మార్గమద్యమంలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఈ నౌక యొక్క కొన్ని శిథిలాలను కనుగొన్నారు. కానీ దీనిలొ కొద్ది బంగారం మాత్రమే దొరికింది. మిగతా బంగారం ఇప్పటి వరకు దొరకలేదు.
5. మీర్ ఉస్మాన్ అలీ నిధి రహస్యం :
COMMENTS