నల్లమల అడవి రహస్యాలు
Nallamala forest secrets :
- నల్లమల అడవులు ఆంద్రప్రదేశ్ లోని 5 జిల్లాలలో (కర్నూల్,మహబాబునగర్ ,ప్రకాశం,గుంటూరు) విస్తరించిఉన్నాయి.
- పెన్నా నది మరియు కృష్ణా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి.
- నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనిని పులులను సంరక్షించడం కోసం ఏర్పాటు చేశారు. భారత దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఇది ఒకటి.
- ఈ అడవుల్లో పడిన వర్షపు నీరు మొత్తం గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి.
- నల్లమల అడవులను నల్లమల కోడలు అని కూడా పిలుస్తారు. ఈ అడవి మొత్తం కొండలతో నిండి ఉంటుంది.
- నల్లమల అడవి ప్రాంతంలో ఆటవిక తెగలు చెంచులు ఇప్పటికి నివసిస్తున్నారు.
- ఈ అడవి మధ్యభాగంలో రైలు మార్గం కూడా ఉన్నది. గుంటూరు – గుంతకల్లు రైలు ప్రయాణం చేసేవారు నల్లమల అడవిని చూడవచ్చు.
- నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు ఉంటాయి. ఈ అడవిలో పులులు ఎక్కువగా తిరుగుతుంటాయి.
- ఈ అడవుల్లో బైరాని కొండ, గుండ్ల బ్రహ్మయేశ్వరం ఉన్నాయి. వీటిని చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైన అడవి మధ్యలో ప్రయాణించాల్సి వస్తుంది.
- నల్లమల అడవుల్లో వజ్రాలు మరియు పురాతన సంపద చాలా వరకు దాగిఉన్నాయనే ప్రచారం ప్రాచుర్యంలో ఉంది. అనేక జిల్లాల నుంచి ప్రజలు వజ్రాల వేట కోసం ఇక్కడికి వస్తుంటారు.
- శ్రీశైలం ప్రాజెక్టు, గుండ్ల బ్రహ్మయేశ్వర శిఖర జలపాతం, నెమలి గుండం, ఓంకారం, మహానంది, రుద్రకోడూర్, పావురాలగుట్ట వంటివి నల్లమల అటవీ ప్రాంతం దగ్గరలో చూడదగ్గ ప్రదేశాలు.
- ఆత్మకూరు నుండి నంద్యాలకు వెళ్లే మార్గంలో నల్లకాలువ గ్రామానికి సమీపంలో వైఎస్ఆర్ స్మృతివనాన్ని ఏర్పాటుచేయడం జరిగింది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
- భయంకరమైన విషయం ఏమిటంటే చాలా మంది మూఢనమ్మకాలను నమ్మే వారు గుప్త నిధుల కోసం ఈ అడవుల్లో నరబలి చేస్తుంటారు. మనుషులను నరబలి చేసిన ప్రదేశేషాలలో ఆనవాళ్లు చాలా వరకు కనిపించాయి.
- నల్లమల అడవుల్లో అన్వేషణ చేసి యురేనియం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. దీనిని వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల అక్కడి జంతు,జీవ జాతులకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది.
నల్లమల అటవీ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు :
1. కొన్ని సంవత్సరాల క్రితం శివస్వాములు శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోయారు. అప్పటి ప్రభుత్వం వీరిని హెలికాఫ్టర్ ద్వారా గాలించి జాడను కనుగొన్నారు.
2. 2009 సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఈ అటవీ ప్రాంతంలోనే కూలిపోయింది. సెప్టెంబర్ 2, 2009 ఉదయం మరణించడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి మరణించిన పావురాల గుట్ట ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘
3. గుప్త నిధుల కోసం అడవుల్లోకి బయలుదేరిన చాలా మంది వ్యక్తులు ఇప్పటికి ప్రాణాలతో తిరిగి రాలేదు.
4. అడవి దగ్గరలో నివసించే ప్రజలు అప్పుడప్పుడు కట్టెల కోసం ఈ అడవుల్లోకి వెళ్తుంటారు. ఇలా వెళ్లిన వాళ్ళల్లో కొంతమంది క్రూర మృగాలకు బలైపోయినారు.
COMMENTS