కోహినూరు వజ్రం రియల్ స్టోరీ
Kohinoor diamond real story :
కోహినూర్ (Kohinoor) డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలువైన వజ్రం ఇప్పటివరకు ప్రపంచంలో దీని అంత విలువైన వజ్రం ఎక్కడ దొరకట్లేదు. ఈ వజ్రం కోసం చాలా యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది రాజులు మరణించారు. వారి రాజ్యాలు నాశనం అయిపోయాయి. కానీ ఈ వజ్రాన్ని ధరించిన వారు మాత్రం చాలా కాలం పాటు తిరుగులేకుండా బ్రతికారు. రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించుకున్నారు అయితే ఈ వజ్రం యొక్క విలువ దాదాపు ప్రపంచమంతా ఒకరోజు చేసే ఖర్చుతో సమానంగా ఉంటుంది. అయితే ఈ వజ్రం ఎక్కడ దొరికింది దీని వల్ల జరిగిన పరిణామాలు ఏమిటి ఇలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
కోహినూరు వజ్రం పూర్తి చరిత్ర :
భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొల్లూరు గనులలో దొరికిన కోహినూరు వజ్రం అప్పటి కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుడు దగ్గర ఉండేది. ఈ వజ్రం యొక్క విలువ గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తానులు మాలిక్ కాపూర్ అనే సైన్యాధిపతి ప్రతాపరుద్రుని దగ్గరికి పంపుతారు. వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం ఏర్పడిన తర్వాత ప్రతాపరుద్రుడు తన దగ్గరున్న వజ్రాన్ని సైన్యాధికారికి ఇచ్చి పంపుతాడు. ఇక అప్పట్నుంచి కోహినూరు వజ్రం ఢిల్లీ సుల్తానుల సొంతమవుతుంది. దాని తర్వాత ఢిల్లీని పరిపాలించిన రాజుల దగ్గర ఒకరి తర్వాత ఒకరికి చేతులు మారుతూ వచ్చింది. చివరగా ఇబ్రహీం లోడీ అనే రాజు ఈ వజ్రాన్ని సాధించుకున్నాడు.
1526వ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ మొదటి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అయినటువంటి బాబర్ చేతిలో ఓడిపోయి మరణానికి గురి అవుతాడు. ఇబ్రహీం లోడి మరణించిన తర్వాత కోహినూరు వజ్రం తో పాటు ఢిల్లీ సుల్తానులు సంపాదించిన సంపద మొత్తం బాబర్ తన సొంతం చేసుకుంటాడు. దాని తరువాత కోహినూరు వజ్రం ఖరీదు దాని యొక్క గొప్పతనం గురించి ఎన్నో విషయాలు బాబర్ రాసినటువంటి బాబర్ హయాం అనే గ్రంథంలో లిఖించబడింది వజ్రం యొక్క గొప్పతనాన్ని బాబర్ అందరికి తెలియజేయడం వల్ల అప్పట్లో ఆ వజ్రాన్ని బాబర్ వజ్రం అనే పేరుతో పిలిచేవారు.
బాబర్ 1530 వ సంవత్సరంలో తన కుమారుడు అయినటువంటి హుమాయున్ ని తన సామ్రాజ్య వారసుడిగా పట్టాభిషేకం చేసి అతనికి ఎంతో ఇష్టమైన టువంటి కోహినూర్ వజ్రాన్ని కూడా ఇస్తాడు. హుమాయూన్ తన తండ్రి ఇచ్చిన కోహినూర్ వజ్రం కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన వద్ద వజ్రం ఉంది అని తెలిస్తే ఇతర రాజులు అందరూ యుద్ధానికి వస్తారు అని భావించి హుమయున్ తన రాజ్యాన్ని రాజస్థాన్ కి మార్చుకొని అక్కడికి వెళ్ళి పోతాడు. రాజస్థాన్ కి వెళ్లి పోయిన తర్వాత కూడా అక్కడ ఒక సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దాని తర్వాత కోహినూరు వజ్రం గొప్పతనం గురించి తెలుసుకున్న marwar సంస్థానానికి రాజు అయినటువంటి మాల్ దేవ్ రాథోర్ రాజు యుద్ధానికి దిగి యుద్ధంలో హుమాయున్ ని ఓడిస్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో హుమాయూన్ తన దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని మాల్ దేవ్ రాథోర్ రాజు కి అప్పగిస్తాడు.దీని తర్వాత మళ్లీ కోహినూర్ (Kohinoor) వజ్రాన్ని తమ సొంతం చేసుకోవాలని ఢిల్లీ సుల్తానులు మాల్ దేవ్ రాథోర్ పైకి యుద్ధానికి వస్తారు. యుద్ధంలో రాజా మాల్ దేవ్ ను ఓడించి తన రాజ్యాన్ని తో పాటు సకల సంపదలు మరియు కోహినూర్ వజ్రాన్ని కూడా తిరిగి సొంతం చేసుకుంటారు. కోహినూరు వజ్రం తిరిగి ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వచ్చింది అని తెలుసుకున్న నాదర్ షా అనే రాజు ఈ వజ్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటాడు. అయితే అప్పటికే ఈ కోహినూరు వజ్రం చాలామంది ఢిల్లీ సుల్తానుల చేతులు మారుతూ మహమ్మద్ షా అనే ఢిల్లీ సుల్తాను చేతిలోకి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నాదర్ షా, మహమ్మద్ షా గురించి గాలింపు మొదలుపెట్టి మహమ్మద్ షా దగ్గర కోహినూర్ డైమండ్ తో పాటు నెమలి సింహాసనం వంటి విలువైన వస్తువులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ కాలం లో ఉన్న అన్ని సింహాసనా లలో నెమలి సింహాసనం చాలా విలువైనది. ఈ విషయాలన్నీ తెలుసుకుని నాదర్ షా మొఘల్ సామ్రాజ్యం పై యుద్ధానికి వస్తాడు. నాదర్ షా తెలివిగా మొగల్ సామ్రాజ్యం చుట్టూ ఉన్న సైన్యాన్ని మొత్తం అంతం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ షా 3 లక్షల మంది సైనికులను సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎదుర్కొనేందుకుసిద్ధంగా ఉంటాడు. 1739 ఫిబ్రవరి 13వ తేదీన మహమ్మద్ షా సైన్యానికి మరియు నాదర్ షా సైన్యానికి భారీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నాదర్ షా సైన్యం మహమ్మద్ షా సైన్యాన్ని 3 గంటల్లోనే ఓడిస్తారు. దీని తర్వాత నాదర్ షా సైన్యం ఆ రాజ్యంలోని ఖజానా మొత్తం దోచుకుంటారు. విలువైన ఆభరణాల తో పాటుగా కోహినూర్ డైమండ్ తీసుకెళ్ళిపోతారు. అప్పటిి నుంచి కోహినూర్ డైమండ్ నాదర్ షా దగ్గరే ఉండి పోతుంది. కొంతకాలం తర్వాత నాదర్ షా చనిపోతాడు. ఇతను పోయిన తర్వాత కోహినూరు వజ్రం మనవడి దగ్గర ఉండి పోతుంది.
నాదర్ షా మనవడు పెరిగి పెద్దయిన తర్వాత కోహినూరు వజ్రం కోసం కోసం జరిగిన యుద్ధాల గురించి తెలుసుకొని ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత తనకి రక్షణ కావాలని ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్య స్థాపకుడు అహ్మద్ షా దుల్హన్ కు కోహినూరు వజ్రం అప్పగిస్తాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అహ్మద్ షా దుల్హన్ దగ్గర ఉన్న ఈ డైమండ్ ను అతని వారసుడు సూజాషా తీసుకుంటాడు. ఒక సంవత్సర కాలం తర్వాత రష్యా కు మరియు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరగబోతుందని భావించిన సుజా షా ఆఫ్ఘనిస్తాన్ ను వదిలేసి తన దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తీసుకుని పంజాబ్ లోని ని లోహర్ కి చేరుకుంటాడు. ఇతను అక్కడికి చేరుకున్న తర్వాత పంజాబ్ లోని సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మరియు పంజాబ్ యొక్క రాజు అయినటువంటి రంజిత్ సింగ్ కు 1813 వ సంవత్సరంలో కోహినూరు వజ్రం గురించి తెలుస్తుంది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రంజిత్ సింగ్ ఆ వజ్రాన్ని సుజాషా దగ్గర నుంచి తీసుకొని తన సొంతం చేసుకుంటాడు. రంజిత్ సింగ్ ముసలివాడై అనారోగ్యంతో మరణించిన తర్వాత తన కుమారుడు అయినటువంటి దిలీప్ సింగ్ కు కోహినూరు వజ్రం సొంతమవుతుంది.
అయితే అప్పటికే బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలను దోచుకోవడం మొదలుపెడతారు. దీనితో బ్రిటిష్ వారికి భయపడి అప్పటికి చాలా చిన్న వయసు వాడు అయిన దిలీప్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి లార్డ్ డల్ హౌస్ చేతికి ఇవ్వగా అతను విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇస్తాడు.
విక్టోరియా మహారాణి ఆ వజ్రాన్ని మళ్లీ సాన పెట్టించడం తో అప్పటికి 186 క్యారెట్ల వజ్రం 109 క్యారెట్ల బరువు తగ్గిపోతుంది. ఈ విధంగా మళ్ళీ సానబెట్టిన వజ్రాన్ని తన కిరీటంలో పొందు పరచుకొని ధరిస్తుంది. అప్పటి నుంచి భారత దేశం మొత్తాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా విస్తరింపచేస్తుంది. ఆ తర్వాత తర్వాత కింగ్ చార్లెస్ మరియు ఈ వజ్రాన్ని ధరించిన రాజులందరూ చనిపోతూ వచ్చారు. కానీ లండన్ దేశం రాణి ధరిస్తే తనకు ఏమి కాకపోగా భారతదేశం అంతటిని విశాలంగా విస్తరింపజేసింది. కనుక లండన్ దేశానికి చెందిన రాణులు మాత్రమే కోహినూర్ వజ్రాన్ని ధరించాలని లార్డ్ తన డైరీలో రాసి పెట్టాడు. ఈ విధంగా కొంతకాలం క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ మరియు ఎలిజిబెత్ రాణులు ఈ వజ్రాన్ని ధరించారు. ఈ విధంగా చాలా మంది రాణులు వజ్రాన్ని ధరించినా కూడా వారికి ఏం కాకపోవడంతో కోహినూరు వజ్రం ఆడవారికి అదృష్టం మగ వారికి దురదృష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచి బ్రిటిష్ రాజ కుటుంబం కోహినూర్ వజ్రాన్ని వారి ఇంటి పెద్ద కోడలుకు వారసత్వ కానుకగా ఇస్తూ వచ్చేది. 1851 వ సంవత్సరం నాటికి ఈ వజ్రం లండన్ లోని బ్రిటీష్ క్రౌన్ జువెల్స్ లో ఉంచబడింది.
1947వ సంవత్సరంలో కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇండియాకి ఇవ్వాలని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ పెట్టారు. కానీ అప్పటికే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం మరియు ఆ వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి కావడంతో ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా కొంతకాలం తర్వాత కోహినూరు వజ్రం ఇండియాకి తిరిగి వస్తుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. కానీ Provisions of antiquities and treasures act, 1973 ప్రకారం కోహినూర్ వజ్రాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు అని కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ యాక్ట్ ప్రకారంం చోరీ చేసిన లేదా బలవంతంగా లాక్కున్న వస్తువులను మాత్రమే తిరిగి తెచ్చుకోగలం. కోహినూర్ (Kohinoor) వజ్రం బ్రిటన్ రాణి కి బహుమతిగా ఇవ్వడం కారణంగా తిరిగి ఇవ్వడం చాలా కష్టం అని ప్రభుత్వం చెప్పింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016వ సంవత్సరంలో భారత దేశ స్వతంత్రానికి ముందు మన దేశం నుంచి దోచుకున్న సంపదను తిరిగి తీసుకు రావాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఆఫీసర్ సుప్రీం కోర్టులో బిల్ దాఖలు చేశాడు. అయినా కూడా ఏ విధమైనటువంటిి ఫలితం దక్కలేదు.
భారతీయులు కోహినూర్ డైమండ్ ని చూడాలని అనిపిస్తే లండన్ లో ఉన్న మ్యూజియం బ్రిటిష్ క్రౌన్ జువేల్స్ లో చూడవచ్చు. కోహినూరు వజ్రం ఇండియాకు వచ్చే అవకాశం లేదు. కోహినూర్ డైమండ్ మనదేశంలో లేకపోయినా మన భారతదేశానికి పెద్ద గుర్తింపు అని చెప్పుకోవడానికి బాగుంటుంది.
COMMENTS