Dasara Holidays : ' దసరా ' సెలవులు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు ఇవ్వనున్నారు.
అంటే కేవలం 6 రోజులు మాత్రమే సెలవులు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకడమిక్ క్యాలెండర్(2022-23)లో దసరా హాలీడేస్ గురించి ముందుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది.
- ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు.
- క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు.
- క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
- సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.
తెలంగాణలో దసరా సెలవులు ఇలా.
తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు ఈ సారి 16 రోజులపాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు మొత్తం 14 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
- సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు దసరా సెలవులు (14రోజులు). బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 16 రోజులు సెలవులు.
- క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
- జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు
- వేసవి సెలవులు ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు.
ఈసారి తెలంగాణలో పదహారు రోజులు వస్తుండటంతో సర్కారు సెలవులు తగ్గించాలని చూస్తోంది. గతంలో భారీ వర్షాల కారణంగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు పదహారు రోజులంటే సిలబస్ పూర్తి కాకుండా పోతోందనే ఉద్దేశంతోనే సెలవులు తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిలబస్ పూర్తి కాకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో సెలవులు తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. చిన్న తరగతులకు యథాతథంగా సెలవులు ఇస్తున్నా పెద్ద తరగతులకు మాత్రం తగ్గించే యోచన చేస్తున్నారు. ముఖ్యంగా 9,10 తరగతుల విద్యార్థులకు సెలవులను తగ్గించాలని యోచిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటమే.
COMMENTS