నెలకు రూ. 210 ఆదా చేస్తే రూ.60,000 పెన్షన్!
Save 210 Rs per month will get Rs 60,000 pension!: రిటైర్మెంట్ తర్వాత మెరుగైన జీవితం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ చక్కటి స్కీమ్ ను అమలు చేస్తోంది. రిటైర్మెంట్ తర్వాత హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి. ఇది అసంఘటిత రంగ ఉద్యోగుల కోసం, వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇప్పటికే అనేక మంది ఈ పథకంలో చేరారు. ఈ నేపథ్యంలో స్కీమ్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఈ స్కీమ్ లో చేరాలనుకునే వారి కనీస వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. పెట్టుబడిదారులు కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5000 వరకు నెలవారీ పెన్షన్ను ఎంచుకోవచ్చు. 18 సంవత్సరాల వయస్సు గల పెట్టుబడిదారులు రిటైర్మెంట్ చేసినప్పటి నుంచి నెలవారీ రూ.5000 పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 పెట్టుబడి పెట్టాలి. నెలకు రూ.210 పెట్టుబడి అంటే రోజుకు రూ.7కి రూపాయలు. ఏడాదిలో పెట్టుబడిదారుడికి రూ.60,000 పెన్షన్ అందుతుంది. అయితే వ్యక్తికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ. 5000 నెలవారీ పెన్షన్ను పొందుతాడు.
మరి ఈ స్కీమ్ లో ఎలా చేరాలి:
- ముందుగా అటల్ పెన్షన్ యోజన అధికారిక వెబ్సైట్- https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్సైట్కి వెళ్లాలి
- వ్యక్తిగత, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి
- ఆధార్ కార్డ్కి లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది.
- బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి. ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ తప్పనిసరి
- ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతా యాక్టివేట్ అవుతుంది.
- నామినీ వివరాలను నమోదు చేసి ప్రీమియం చెల్లింపు ఎంపికను ఎంచుకోండి.
- ఫారమ్పై ఈ-సైన్ చేయండి. మీ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
COMMENTS