సిరి ధాన్యాలు - కషాయాలు : : సంపూర్ణ సిరి జీవన మార్గము : "కృషి రత్న" డా౹౹ ఖాదర్ వలి
కొర్రలు:
కొర్రలు తీపి, వగరు
రుచులు
కలిగి ఉంటాయి. మధుమేహ
వ్యాధిగస్థులకిది మంచి ఆహరం. శరీరం
లోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తాగిస్తుంది. వీటిలో
యాంటి ఆక్సిడెంట్లు ఆర్థికంగా ఉంటాయి. కొర్రలలో
అధిక పీచు పదార్ధం, మాంసకృత్తులు,
ఐరన్, మాంగనీస్,
మెగ్నీష్యం, భాస్వరంతో
విటమిన్స్ ఆర్థిక పళ్ళోలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు
మంచి ఆహరం. ఉదర
సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొపి,
మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాధ్యం,
అతిసారం మొదలగు వ్యాధులకు ఓషధహారం.
మాంసకృత్తులు, ఇనుము
ఆర్థికంగా ఉండటం వలన రక్త హీనత నివారణకు చక్కటి ఓషధం. పీచు
పధార్ధంఅధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ
ప్రాంతాలలో జ్వరం వచ్చినపుడు కొర్ర జంగి తాగి దుప్పటి కప్పుకొని పడుకుంటే జ్వరం తగిపోతుందని పేదల అనుభవం. గుండెజబ్బులు,
రక్తహీనత, ఊబకాయం,
కీళ్ళవాతం, రక్తశ్రావం,
కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.
అండుకొర్రలు
సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. ఒక్క
అండుకొర్రలను కనీసం 4 గంటలు
నానబెట్టిన తరువాతే వండుకోవాలి
జీర్ణాశయం, ఆర్ద్రయీటిస్,
బి.పి., థైరాయిడ్,
కంటి సమస్యలు ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి అలాగే మొలలు, భగస్ధరం,
మూలశంక, fissures , అల్సర్ లు మెదదు, రక్తం,
సనాలు, ఎముకల,
ఉదర, పేగుల,
చర్మ సంబంధ కాన్సర్ ల చికిత్స కు బాగా ఉపయోగపడతాయి.
ఉదలు
• ఉదలు రుచికి తీయగా ఉంటాయి.
• ఉధాలతో తాయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారత దేశం లో ఉపవాస దీక్ష లో ఎక్కువగా ఉపయోగిస్తరు.
• ఉత్తరకాడ్, నేపాల్
లో
ఉధాల ఆహారాన్ని గర్భిణలకు, బాలింతలకు
ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే
ఉధాలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు.
• ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతలను సమస్ధితిలో ఉంచుతుంది.
• ఉధాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
• శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికీ ఉధాలు చాల మంచి ఆహరం.
• ఉధాల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి
మంచి ఆహరం.
• జీర్ణాశ్రయంలో ముఖ్యంగా చిన్న పేవులలో ఏర్పడే పుండ్లు, పెదపేవులకి
వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఉధాల ఆహరం కాపాడుతుంది.
ఆరికెలు
• ఆరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి.
• అధిక పోషక విలువలు కలిగి ఉండటం వలన పిల్లలకు మంచి ఆహరం.
• విటమిన్లు, ఖనిజాలు
ఆర్థికంగా ఉంటాయి.
• జీర్ణశక్తిహీత ఆహరం.
• కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి.
• అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉంటాయి.
• రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్
స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
• పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి శక్తినిస్తుంది.
• వీటిని ఇతర పప్పుదినుసులతో (బోబర్లు,
శనగలు ) కలిపి
తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లబిస్తాయి.
• పుష్కలంగా వున్న పీచుపదార్థం వలన బరువు తాగడానికి మంచి ఆహరం. ‘
• కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనికి, వాపులు
తాగడానికి అరికెల మంచి ఆహరం.
• వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతావనికి,రుతుస్తవం క్రమంగా రాని స్రిలకు, మధుమేహ
వ్యాధి గ్రస్తులకు, కంటి
నరాల బలానికి అరికెల మంచి ఆహారం.
• అరిక పిండిని వాపులకు పైపూతగా కూడా వాడతారు.
సామలు:
సామలు తీయగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం
ఎక్కువవడం వల్ల భోజనం తరువాత గుండెలో మంటగా వుండడం, పుల్లతేన్పులు
రావడం, కడుపు
ఉబ్బరం వంటి సమస్యలకు ఓషధము పనిచేస్తుంది. సుఖవ్యాధులు,
అతిసారం, అజీర్ణం,
పురుషుల శుక్లాకణాలవుద్ధికి, ఆడవారి
రుతు సమస్యలకు మంచిది. వీటిలో
వున్న అధిక పీచు పదార్ధం వలన మలబద్దకం ఆరికట్టబడుతుంది. మైగ్రేన్
సమస్యలకు ఈ ఆహరం ఉపశమనం కలిగిస్తుంది. గుండె
సమస్యలకు, ఊబకాయం,
కీళ్లనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహరం.
'సిరి' ఆరోగ్య ముచ్చట్లు:
సిరిధాన్యాలు కొర్రలు (Flxtail Millet), అండుకొర్రలు (Browntop Millet), సామలు (Little Millet), ఈధలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) ప్రకృతి ప్రసాదించిన వారలు ఇవి. ఓషధ
గుణాల సమ్మిళితమై తిండిగింజలు, అంతే
కాదు ఆరోగ్యగుళికలు. వీటిని
తింటూ 6 నెలల
నుంచి 2 సవత్సరాలలో
ఎవరైనా వారి వ్యాధులను నిర్ములించుకోవచ్చు. సిరిధాన్యాలు
పోషకాలను అందరించడమే కాకుండా, రోగ
కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని
శుద్ధిచేస్తాయి. మనిషికి
ఆరోగ్యం అందిస్తాయి.
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తాగిస్తుంది?:
• కొర్రలు : నరాల
శక్తి , మానసిక
దృఢత్వం, ఆర్ద్రయీటిస్,
పార్కిన్ సన్, మూర్చరోగాల
, నుంచి విముక్తి.
• అరికలు : రక్తశుద్ధి
, రక్తహీనత, రోగనిరోధక,
శక్తీ, డయాబెటిస్,
మలబద్దకం, మంచినిద్ర.
• ఉధాలు : లివరు,
కిడ్నీ, నిర్ణాల
గ్రంధులు (ఎండోక్రెయిన్
గ్లాడ్స్), కొలెస్ట్రాల్
తాగించడం, కామెర్లు.
• సామలు : అండాశయం,
వీర్యకణ సమస్యలు, పిసిఓడి
, సంతానలేమి సమస్యల నివారణ.
• అండుకొర్రలు : జీర్ణశయం,
ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి
సమస్యలు, ఊబకాయ
నివారణ.
ఎలా వాడాలంటే
ఒక అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు
నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా
సిరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.సమయాభావం ఉంటె ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.
సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు. దేనికి
అది విడివిడిగా వండుకోవాలి.కలగలిపి వండుకొని తినటం ద్వారా ఎటువంటి లాభం ఉండదు కాక ఉండదు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్ని వాడాలి. తరువాత
రెండు రోజులు వేరొక సిరి ధాన్యాన్ని వాడాలి. అలాగా
ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున తీసుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు
కాషాయాలు కూడా తీసుకోగలిగితే మంచిది.
ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి
సమస్యను బట్టి సిరి ధాన్యాలతో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చు.ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకొని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరఖ్ల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి. ఉదాహరణకు
సుగర్,కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటె వారు అరికలు 3 రోజులు,
ఉదాలు 3 రోజులు
తింటూ మిగతా 3 రకాల
ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి .ఈ
సమస్యతో పాటు ప్రోస్టేట్ సమస్య కూడా ఉంటె సమాలు కూడా 3 రోజులు
తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.
వరి బియ్యం, గోధుమ,
మైదా, పాలు,పంచదార, కాఫీ, టీ,
అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం,
రిఫైన్డ్ ఆయిల్ తప్పనిసరిగా మాని, దీనిని
ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు
మజ్జిగ, వాడుకోవచ్చు,
సముద్రపు ఉప్పు, గానుగ
నూనె వాడుకోవాలి.
రక్తహీనతకు 3
రోజులు అరికెలు,3 రోజులు
సమాలు రోజుకి 3 పూటలు
తినాలి. తరువాత
3రోజులు ఒక్కొక్క సిరిధాన్యం 3 పూటలు
తినాలి. దీనితో
పాటు పరగడుపున క్యారెట్ ,ఉసిరి,జామ లేదా బీటురూట్ రసం తీసుకోవాలి. సాయంత్రం
20 కరివే పాకు ఆకులు 1 గ్లాసు
పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి 15- 20 నిమిషాల
తరువాత భోజనానికి 1 గంట
ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారించబడుతుంది.
ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చు. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. సిరిధాన్యాలకు 5 - 6 రేట్లు నీరు పోసి 4 -5 గంటలు నానబెట్టి, ఆ తరువాత గంజిలాగా వండుకొని రోజులో ఎప్పుడైనా, ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు.
థైరాయిడ్: ఈ
సమస్య ఉన్న వారు
3 రోజులు సామ బియ్యం, ఒక
రోజు అరికెలు,ఒక రోజు ఊదాలు, ఒక
రోజు కొర్రలు, ఒక
రోజు అందు కొర్రలు, వండుకొని
మూడు పూటలు అదే తినాలి. తిరిగి
3 రోజులు సమాలు , తరువాత
నాలుగు రోజులు ఒక్కొక్క సిరి ధాన్యం తినాలి. దీనికి
తోడు మెంతి ఆకుల కాషాయం ఒక వారం, పుదీనా
ఆకుల కాషాయం ఒక వారం, తమలపాకుల
కాషాయం ఒక వారం
రోజుకి 2-3
సార్లు తీసుకోవాలి. గంగలో
స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజు ఉదయం 3చెంచాలు
3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో
అన్ని రకాల మందులు మానివెయ్యవచ్చు.రోజు తప్పనిసరిగా "నడక"మర్చిపోకూడదు.
ఏ ఆహార పదార్థ గుణగణాలైన దానిలో ఉండే పీచు, పిండి
పదార్థాల నిష్పత్తి ని బట్టి నిర్ణయింపబడతాయి. వీటి
నిష్పత్తి 10 కంటే
తక్కువ ఉంటె రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహరం కింద లెక్క. ఈ
సిరిధాన్యాలల్లో ఈ నిష్పత్తి 5 .5 నుండి
8 .8 వరకు ఉంటుంది. వరి
బియ్యంలో ఆ నిష్పత్తి 3 .85 ఉంటుంది.ముడి బియ్యం, గోధుమలల్లో
కూడా నిష్పత్తి పెద్దగా తేడా లేదు.
సిరిధాన్యాలు ఎందుకు తినాలి?
పీచుతో గ్లూకోజ్ కు చెక్
మన ఆహారంలో ఉన్న సహజ పీచు పదార్థమే.(Dietary ఫైబర్)మన ఆహరం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది.ఒకేసారిగా ఆర్థిక మొత్తంలో గ్లూకోజ్ ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.
ప్రస్తుతం, వరి,
గోధుమ,ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0 .25 శాతం
- 05 %కి తగ్గిపోయింది. అందుకే
ఇవి తిన్న 15 నుండి
35 నిమిషాలలో గ్లూకోజ్ గా (చెక్కరగా
-అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా )మారిపోయి,
100 గ్రాముల ఆహరం తింటే 70 గ్రాముల
గ్లూకోజ్ (చక్కెర)గా 'ఒక్కసారిగా' రక్తంలోకి
వచ్చి చేరుతుంది.ఇలా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు జరిగితే?వీటికి తోడుగా స్వీట్లు తింటే...?బిస్కెట్లలో,
బర్గర్, పిజ్జా
లో మైదాతో చేసిన రొట్టె కూడా తోడైతే?అధిక మొత్తాలతో గ్లూకోజ్ ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది.కొవ్వు పెంచుతుంది. చక్కెర
వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది.అనే రోగాలకు దరి తీస్తుంది.
మైదాతో చేసిన పదార్థాలు కేవలం 10
నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా
తయారీలో వాడే రసాయనాలు క్లోమ గ్రంథికి బాగా కీడు చేస్తాయి.
సాధారణంగా మన శరీరంలోకి రక్తం (మొత్తం
4 నుండి 5 లీటర్లే)
లో ఉండే గ్లూకోజ్ 6 నుండి
7 గ్రాములే. ఆహరం
తిన్న తరువాత అది జీర్ణమై, చివరగా
గ్లూకోజ్ గా మారి రక్తంలోకి గ్లూకోజ్ రావడం శరీరమంతా సరఫరా జరగటం తెల్సిందే. కానీ
ఒక్కసారిగా 10 నిమిషాల్లాల్లో
అధిక మొత్తంలో చేరటం ఆరోగ్యానికి చేటు. పెద్దలకు
మధుమేహం ఉన్న వారికీ, ఇతర
రోజాగ్రహస్తులకు (మలబద్దకం,
ఫీట్స్, మొలలు,
మూలశంక ట్రాగ్లిసెరైడ్స్, అధిక
రక్తపీడనం అంటే బీపీ. మూత్రపిండాల
రోగాలు, హుద్రోగుల
వాగేరా అందరికి) మరింత
ప్రమాదకరం.
అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు
అలవాటు చేసుకోవాలి.ఇవి 5 నుండి
7 గంటల పాటు కొద్దీ కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ను రక్తంలోకి వదులుతుంటాయి.
సిరిధాన్యాల విశిష్టత
సహజ పీచు పదార్ధం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు
పూటలా తిన్నప్పుడు, ఆ
రోజుకు మనిషి అవసరమైన 25-30 గ్రాముల
పీచుపదార్థం (ప్రతి
మానవుడికి రోజుకి 38 గ్రాముల
పీచుపదార్థం కావాలి) ధాన్యాల
నుండే లభిస్తుంది. తక్కిన
10 గ్రాములు కూరగాలా నుండి, ఆకు
కూరలు పొందవచ్చు.
ఒక్కొక సిరిధాన్యము కొన్ని రకాల దేహపు అవసరాలను, ప్రతేకమైన
రోగనిర్మలను శక్తిని కలిసి వున్నాయి.
వారి, గోధుమలలో
పీచు పదార్ధం / ఫైబర్
0.2 నుండి 1.2 వరకు
ఉన్నపటికీ, అది
ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ
సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే
ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.
1. కొర్ర బియ్యం :సమతుల్యమైన
ఆహరం. 8 శాతం
పీచుపదార్థం తో పాటు 12 శాతం
ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణీ
స్త్రీలకూ మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో
శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగెట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో
ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. అవి
శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు.
వారిని పోగొట్టగలిగే లక్షణం నరాల సంభందమైన బలహీనత, convulsion లకు సరైన ఆహరం కొర్ర బియ్యం. కొన్ని
రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి
క్యాన్సర్, ఊపిరితిత్తుల
క్యాన్సర్, ఉదార
క్యాన్సర్,పార్కిన్సన్ రోగం ఆస్తమా (అరికెలతో
పాటుగా )నివారించడంలో
కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.
2. అరికాలు బియ్యం :రక్త
శుద్ధికి, ఎముకల
గుజ్జు సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా
వ్యాధి, మూత్ర
పిండాలు, ప్రోస్టేటు,
రక్త క్యాన్సర్, ప్రేగులు,
థైరాయిడు, గొంతు,క్లోమ గ్రంథులు, కాలేయపు
క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అధికంగా చక్కెర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రిను
వైపు వెళ్లిన వారికీ కూడా అరికెలు మేలు చేస్తాయి. డెంగ్యూ,
టైఫాయిడు, వైరస్
జ్వరాలతో నీరసించిన వరి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికాలు.
3. సామ బియ్యం: మగ,
ఆడ వారి పునరుత్పత్తు మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి . ఆడవారిలో
పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ
వారిలో వీర్యకరణల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక
మానవుడి లింపు నాడి వ్యవస్థ శుద్ధికి, మెదడు,
గొంతు, రక్త
క్యాన్సర్, థైరాయిడు,
క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సమాలు వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
4. ఊదా బియ్యం: థైరాయిడు,
క్లోమ, గ్రంథులకు
మంచివి. చక్కెర
వ్యాధిని పారదోలుతాయి. కాలేయం
, మూత్రాశయం , గాల్
బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను
తగ్గించడానికి వచ్చి తగ్గక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు,
గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదా బియ్యం పనికి వస్తాయి.
5. అండుకొర్ర బియ్యం : మొలలు
భగన్దరం మూలశంక, ఫీసురేష్,
అల్సర్లు, మెదడు,
రక్తం, స్తనాలు
ఎముకలు , ఉదర,ప్రేగుల,చర్మ సంబంధ, క్యాన్సర్లను
చికిత్సకు బాగా ఉపయోగపడుతాయి.
మధుమేహం టైపు 2 రావడానికి
కారణాలు
దేశంలో సుమారు 10 కోట్లు
ప్రజలు మధుమేహ వ్యాధిగ్రస్థులు. పీచు
పదార్థం లేని ఆహారాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవటమే వ్యాధి ఎక్కువగా రావటానికి ప్రధాన కారణం. దీనితో
పాటు శీతలపానీయాలు, మద్యపానం,
పీచుపదార్థంలేని మాంసం, ప్యాకింగ్
తిండి పదార్థాలు తీసుకోవటం కూడా మధుమేహానికి కారణమని చెప్పవచ్చు. మానసిక
ఒత్తిడిలు, జీవనశైలి,
ఉద్రేకాలు, ఉద్వేగాలు,
వ్యాపారంలో వచ్చే నష్టాలు, ప్రేమ
వైఫల్యాలు, యాంటిబయాటిక్
మందులు విపరీతంగా వాడటంతో పాటు క్లోమ గ్రంధి సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.
ఒక్క'మధుమేహం' రోగం
వస్తే ఆ మనిషికి మరో పదిరోగాలు వచ్చినట్లే. కళ్ళు,
గుండె, ఎముకలు,
మెదడు, మూత్రపిండాలు,
పునరుత్పత్తి వ్యవస్థకు అంటే మనిషి అన్ని అవయవాలకు ముప్పు తెస్తుంది.
తొలి చేసే తీపిని తొలగించే పది సూత్రాలు
దీర్ఘవ్యాధుల జీవిత ఆనందాలను హరిస్తాయి. మంచి
ఆహారముద్వారా మన ఆరోగ్యం మీద మనమే పట్టు సాధించాలి. పాలిష్
చేయని సిరిధాన్యాలు శక్తిని ప్రసాదిస్తాయి. వాటి
ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. వీటితో
శరీరం ఉతేజమవుతుంది. రోగరహీతమై
మంచి బలం చేకూరుతుంది.
1. 8 నుండి 12.5 % పీచు
పదార్థమున్న సిరిధాన్యాలనే ప్రధాన ఆహారంగా తీసుకోవాలి.
2. రోజు 50 నుండి
70 నిముషాలు నడవడం అవసరం.
3. అధికంగా ఆకుకూరలు, సేంద్రియ
ఆహరం తీసుకోవాలి.
4. మునగ ఆకు, మునగ
కాయ, మెంతులు,
మెంతికూర, కలబంద,
కాకరకాయ, బెండకాయ,
జామకాయల వాడకం పెంచుకోవాలి. జామా,
మామిడి ఆకుల కషాయాన్ని ఉదయం తాగాలి.
5. పాల వాడకం మనాలి. పెరుగు
మజ్జిగల రూపంలోనే తీసుకోవాలి. కొని
తినే ప్యాకెడ్
ఆహారాలను దూరం పెట్టాలి.
6. మైదా, మైదాతో
చేసిన ఆహారాలను, రిఫైన్డ్
నూనెలను దూరంగా ఉంచాలి, కట్టే
గానుగ నూనెలు గాని ఆర్గానిక్ కోల్డ్- ఫ్రెజ్డ్ నూనెలు వినియోగించాలి.
7. ఉద్రేకాలు, ఆవేశాలను
నియంత్రించుకోవాలి.
8. వారి అన్నం, గోధుమలు
, మైదాతో కూడిన పదార్థాలు అతి తక్కువ వాడటం లేదా వాటిని పూర్తిగా దూరంగా ఉంచాలి. వీలైతే
తీసుకోరాదు.
9. హెచ్ స్ సి న్ ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల
చెక్కెరలు వేసిన రెడీమేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి.
10. మధుమేహం -2 అందరికి
వచ్చేదే కదా అని నిర్లిప్తత పనికిరాదు. ఈ
వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించాలి. వ్యాధి
వస్తే సరైన ఆహరం, మరీనా
జీవన శైలితో పోరాడటం. ఆహారానికి
ముందు, ఆహరం
తిన్న గంటకి రక్త పరీక్షలు కాకుండా Hb A1C రీడింగ్ 4 నెలలకు
లేదా 6 నెలలకు
తీసుకొని శాస్త్రీయంగా సరైన పద్దతిలో తీసుకోవాలి.
హీనత నుంచి శక్తి సాధనకు...
మన దేశం లో ఎక్కువగా ప్రజలు ముఖ్యనగ మహిళలు రక్తహీనతో బాధపడుతున్నారు. ఈ
సమస్యను అధిమించడానికి సిరిధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి.
• రక్తం పెరగడానికి అరికాలు రెండు రోజులు, సమ్మెలు
రెండు రోజులు తినాలి.మిగతా 3 రకాల
సిరిధాన్యాలు ఒక్కో రోజు తినాలి.
• కనీసం 2 గంటలు
అండుకొర్రలు 4 గంటలు
నానబెట్టి వండుకొని తినాలి.
• ఆయా రోజుల్లో 3 పూటలు ఇవే తినాలి.
సిరిధాన్యాలను రోజు మూడు పూటలా ప్రధాన ఆహారంగా తీసుకుంటూనే ....పరగడుపున
క్యారెట్, బీట్రూట్
, జామా లేదా ఉసిరి రసం తాగాలి.
• క్యారెట్ ముక్కలు 25గ్రాములు
• బీట్రూట్ ముక్కలు 25గ్రాములు
• జామా పండు /ఉసిరి
ముక్కలు 05గ్రాములు
వేసి రసం తీసి 200మీ
.లి నీటిలో కలిపి తాగాలి.
సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి
• కరివేపాకు ఆకులు 20
దంచి /మిక్సీలో
వేసి... గ్లాసుడు
మజ్జిగలో కలిపి...15-20నిమిషాల
తర్వాత తాగాలి.
• రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి.
• ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది.
కాన్సర్ కు గుడ్ బై చెప్పేదాం
1970-80 దశకానికి ముందు క్యాన్సర్ రోజులు చాలా అరుదుగా కనిపించేవారు. బహుశా
లక్ష జనాభాలో ఏ ఒక్కరికో వచ్చేది. ఇప్పుడు
ఎటు చుసిన కాన్సర్ రోగులు. ప్రపంచ
ఆరోగ్య సంస్థ కొన్ని ఏళ్ల క్రితం వెబ్ సైట్ తో ఉంచిన సమాచారం ప్రకారం 2030 నాటికీ
కోటి 40 లక్షల
నుంచి రెండు కోట్ల 10 లక్షల
మంది వరకు క్యాన్సర్ బారిన పడే పరిస్థితి నెలకొంది.
ప్రతి రోజు మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు
తింటున్న ఆహరం మరింత విషపూరితంగా మారిపోతుంది.
పురుగు మందులు
జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహరం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో
అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల
నుంచి పంటలసంరక్షణ కోసం పురుగు, తెగుళ్ల
మందుల వాడకం ప్రారంభమైంది.వీటి వాడకంలో విచక్షణ లోపించటంతో ప్రతికూల సమస్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణం
విషతుల్యం కావటం ప్రారంభమైంది.
జన్యు మార్పిడి పంటలు
క్యాన్సర్
వ్యాధి ప్రబలటానికి జన్యుమార్పిడి మొక్కజొన్న మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి
సోయాబీన్స్ ఉత్పత్తి చేసిన రసాయనిక /ఔషధ
కంపెనీలే జన్యుమార్పిడిని మొక్కజొన్నను కూడా రూపొందించాయి.ఈ మొక్కజొన్నలో కొవ్వు అధికం (మొక్కజొన్నలో
సాధారణంగా 100 గ్రాములకు
1మీ. గ్రా
. కొవ్వు ఉంటుంది.)జన్యుమార్పిడి
మొక్కజొన్నను పశువులకు , కోళ్లకు
మేపుతున్నారు. పల
ఉత్పత్తుల, మాంసం,
పందిమాంసం,కోడిమాంసం , కోడిగుడ్లు
,తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విష్యతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరి మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. బేకింగ్
పరిశ్రమ దారులు బిస్కెట్లు ,కేకులు
వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నారు. కూరగాయలను
సైతం విషపదార్థాలు వదలటం లేదు.
కల్తీ వంటనూనెలు
క్యాన్సర్
వ్యాధి విజృభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి
చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి
-8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా
తక్కువ ఉన్న మూలికలతో మినరల్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది.ఇందులో కృతిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు, కొబ్బరి
నూనెల మాదిరిగానే ఉండే కృతిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. దీనివల్ల
విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అందువల్ల
ఆహారోత్పత్తి, ఆహార
శుద్ధి ప్రక్రియలను రసాయన రహితంగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.
తినకూడనివి;వరి బియ్యం ,గోధుమలు,పంచదార,మాంసాహారం, పాలు
క్యాన్సరును విజయవంతంగా జయించిన వారు గాని లేదా క్యాన్సర్కు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సరుకు చికిత్స పొందుతున్న వారు గాని లేదా క్యాన్సర్ జబ్బు బారిన పడకుడనుకున్నవారు గాని .., వరిబియ్యం,గోధుమలు, పంచదార,మాంసాహారం తినకూడదు.ఆ రసాయనాలు మన శరీరంలోనికి అణువణువులోనికి క్రమంగా పోగుపడి (బయో
కాన్సంట్రేషన్) జబ్బును
కల్గిస్తాయి.
కాఫీ, టీ,పాలు తాగరాదు. పెరుగు, మజ్జిగ వాడవచ్చు
ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యపోతుంటారు.
అటువంటప్పుడు నేను ఏ సందిగ్ధము లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే. ముమ్మాటికీ
సాధ్యమే!ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే.మనం తీసుకునే ఆహరం, తాగే
నీరు,మన వృత్తి, క్రమం
తప్పని శారీరక వ్యాయామం, నడక
యోగ , మంచి
అలవాట్లు, ధ్యానం
మన ఆసక్తులు... ఇవన్నీ
మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్ధేశిస్తాయి.అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరిచిపోయాం.వేళా పాల
లేకుండా తినటం,అనారోగ్యకరమైన పోషకాలెన్ని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం.
పాల దిగుబడి పెంచేందుకు పది పశువులకు ఆక్సిటోసిన్ /ఈస్ట్రోజన్
హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాలు.
గోధుమ పిండిని మైదా పిండిగా మార్చడానికి అలోక్సన్ అనే బిలీచింగ్ రసాయనాన్ని వాడుతున్నారు.ఆ మైదా పిండితో బిస్కట్లు, తదితర
బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి
తిన్న వారి దేహాల్లో క్లోమగ్రంధికి బీటా సేల్స్ ను ఉత్పత్తి
చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్
ను నిల్వ చేసి, అవసరం
మేరకు విడుదల చేయటంలో ఈ బీటా సేల్స్ కీలకపాత్ర పోషిస్తాయి.మైదా తినటం వాళ్ళ మనుషులు మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం.
ఏ కాన్సర్ కు ఏ చికిత్స
శ్వాస కోసం క్యాన్సర్: సిరిధాన్యాలు
: కొర్ర బియ్యం తో రెండు రోజులు సామ
బియ్యంతో మరో రెండుకి రోజులు అన్నం వండుకొని తినాలి.మిగతా రకాల సిరిదాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
ఎముకల క్యాన్సర్ : సిరిధాన్యాలు :ఎముకల కేన్సర్ రోగులు అండుకొర్ర బియ్యం 2 రోజులు,
సామ బియ్యం మరొక 2 రకాల
సిరిధాన్యాలను ఒక్కొక్క రాకని ఒక్కొక్క రోజు తినాలి.వీటిని అన్నగా వండుకొని తినాలి. లేదా
గంజి చేసుకొని కూడా తాగొచ్చు.
మెదడు క్యాన్సర్ : సిరిధాన్యాలు
: అరిక బియ్యం 2 రోజులు,
సామ బియ్యం మరో 2 రోజులు,
అండుకొర్ర బియ్యం ఇంకో 2రోజులు తినాలి. మిగతా
2 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
రక్త క్యాన్సర్ : సిరిధాన్యాలు
: అరిక బియ్యం 2 రోజులు,
కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా
3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
మూత్రాశయం /ప్రొటెస్ట్
క్యాన్సర్ : సిరిధాన్యాలు
:ఊదా బియ్యం 2 రోజులు
, అరిక బియ్యం మరో 2 రోజులు
అండుకొర్ర
బియ్యం, మరో
2 రోజులు తినాలి.మిగతా రెండు రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
రొమ్ము క్యాన్సర్ : సిరిధాన్యాలు
:అండుకొర్ర బియ్యం 2 రోజులు,
అరిక బియ్యం మరో 2 రోజులు
తినాలి. మిగతా
3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
నోటి క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు
: కొర్ర బియ్యం 2 రోజులు,
సామ బియ్యం 2 రోజులు
మిగతా 3 రకాల
సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వండుకొని తినాలి.
థైరాయిడు/పాంక్రియాస్ క్యాన్సర్ కు చికిత్స : సిరిధాన్యాలు
:అరిక బియ్యం 2రోజులు,
సామ బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా
3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
పొట్టక్యాన్సరుకు చికిత్స : సిరిధాన్యాలు
: అండుకొర్ర బియ్యం 2 రోజులు
, కొర్ర బియ్యం మరో 2 రోజులు
తినాలి. మిగతా
3రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
చర్మ క్యాన్సరుకు చికిత్స :
ప్రమాదకరమైన క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. సిరిధాన్యాలు:
అండు కొర్ర బియ్యం 2 రోజులు,
కొర్ర బియ్యం మరో రెండు రోజులు తినాలి. మిగతా
3 రకాల సిరిధాన్యాలను ఒక్కొక్క రకాన్ని ఒక్కొక్క రోజు తినాలి.
>>>>> CLICK HERE TO DOWNLOAD
COMMENTS