PARENTS ISSUE ON SONS IN PRAJAVANI
బిడ్డలకు రూ.కోట్ల ఆస్తిని పంచి - అనాథులుగా రేకుల షెడ్డులో అమ్మానాన్న!
కన్న తల్లిదండ్రులను రేకుల షెడ్డులో వదిలేసిన కుమారులు - ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో వాపోయిన వృద్ధ దంపతులు.
Parents Complaint on Sons in Prajavani : పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా, ప్రేమగా పెంచి ప్రయోజకులను చేసి సంపాదించిన కోట్లాది విలువైన ఆస్తులను ఆ తల్లిదండ్రులు పంచి పెట్టారు. రేపటినాడు తమకు ఎలాంటి అవసరం వచ్చినా చేరదీస్తారనే నమ్మకంతో ఉంటారు కన్నవారు. కానీ ఆస్తిని పంచిన తర్వాత ఆ వృద్ధ దంపతులను షెడ్డులో వదిలేశారు. ఆరోగ్య సమస్యలొచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ దీన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
బాధితులు చెప్పిన వివరాల ప్రకారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్కు చెందిన చాందరాజు నారాయణ, శాంతమ్మకు ఐదుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమార్తెలకు ఘనంగా వివాహాలు చేశారు. ఆ తర్వాత వారు కుమారులతో కలిసి ఉన్నారు. తమను వృద్ధాప్యంలో సాకుతారని, అవసరాలు తీరుస్తారని, మంచీచెడులు చూసుకుంటారని సంపాదించిన రూ.కోట్ల విలువైన 10 ఎకరలా వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాన్ని కుమారులిద్దరికీ సమానంగా పంచి ఇచ్చారు.
కానీ ఆ నమ్మకమే వారి పాలిట శాపంగా మారింది. వారిని ప్రయోజకులను చేసిన అమ్మానాన్నలను బాగా చూసుకోవాల్సిన కుమారులు వారిని ఓ రేకుల షెడ్డులో ఉంచారు. అనారోగ్యంతో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. ఆసుపత్రులకు తీసుకెళ్లడం లేదు. అంత బోగాలు అనుభవించిన వారు ఇప్పుడు పింఛను తీసుకుంటూ దైనందిన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ప్రజావాణిలో వాపోయిన తల్లిదండ్రులు :
కోట్ల రూపాయల ఆస్తులకు యజమానులై ఉండి ప్రస్తుతం రేకుల షెడ్డులో ఉంటూ పింఛన్పై ఆధారపడి బతకాల్సి వస్తుందని ఆ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసరాగా ఉండాలని అడిగితే దుర్భాషలాడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పింఛన్ డబ్బులు వస్తే వాటితో రోజులు వెళ్లదీస్తున్నామని చెప్పారు. పిల్లలకు పంచిన ఆస్తిలో తమకు కొంత వాటా ఇప్పించి న్యాయం చేయాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ప్రావిణ్యను వేడుకున్నారు.
COMMENTS