INDIRA SAURAGIRI JAL VIKAS SCHEME
రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు - ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రారంభించిన సీఎం.
ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామని హామీ - అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని వ్యాఖ్య.
CM Revanth Reddy launches Indira Sauragiri Jal Vikas Scheme : రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి :
రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 5, 7.5 హెచ్పీ పంపుసెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని, కరెంట్ పంపుసెట్లు తీసేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
సోలార్ నుంచి ప్రతి రైతుకు నెలకు 3 వేల నుంచి 5 వేల ఆదాయం ఉండాలని, అచ్చంపేట నియోజకవర్గంలో వంద రోజుల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనులకు ఇచ్చిన భూముల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించిన సీఎం, ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ఐఏఎస్ను ప్రత్యేకాధికారిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
స్వేచ్ఛను దేశానికిచ్చేందే కాంగ్రెస్ :
కేంద్రంలో ప్రతిపక్షం ఉన్నా మనల్ని అభినందించాల్సిందే రేవంత్ రెడ్డి అన్నారు. పన్నుల సేకరణలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని, పాలమూరు వాసులకు పాలన చేతకాదన్నారని, స్వేచ్ఛను దేశానికిచ్చేందే కాంగ్రెస్ అని అన్నారు. అందరికీ భూములిచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది కాంగ్రెస్ నినాదని, ప్రతి ఆదివాసి గుండెల్లో ఇందిరమ్మ ఉంటుందని, పాసు పుస్తకం చూసినప్పుడల్లా కాంగ్రెస్ గుర్తుకొస్తుందని వెల్లడించారు.
"రైతులకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా ఇస్తాం. అచ్చంపేటను మోడల్ నియోజకవర్గంగా మారుస్తాం. కరెంట్ పంపుసెట్లు తీసేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలి. సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. సౌర విద్యుదుత్పత్తితో గిరిజన రైతులు ఆదాయం పొందాలి." రేవంత్ రెడ్డి, సీఎం
అడవిలో పుట్టి అడివిలో పెరిగి అడవినే జీవనాధారం చేసుకుని బతుకుతున్న గిరిజనుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచన చేసి ఆర్.ఓ.ఎఫ్ఆర్ చట్టం ద్వారా భూ పట్టాలు ఇచ్చిన గిరిజన రైతులు పంటలు పండించుకోవడానికి ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా గిరిజన రైతులకు సౌర శక్తి విద్యుత్ సౌకర్యం అందించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఉద్యాన వన పంటలకు కావలసిన మొక్కలు ఇవ్వడం, ఆ పంటల నుండి ఆదాయం వచ్చేంత వరకు అదనపు ఆదాయం కల్పించడానికి అంతర పంటలకు సౌకర్యం కల్పిస్తూ గిరిజనుల ఉన్నతి కోసం ప్రభుత్వం సహకరిస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా సాగునీటి వసతి కల్పించే విధంగా పథకాలను తీసుకురాలేదని, దేశంలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టంలో పేర్కొన్న విధంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రవేశ పెట్టి దేశానికి రోల్ మోడల్ నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
నీటి వసతిని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం :
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద అర్హులైన గిరిజన రైతులను ఎంపిక చేసి వారికి వందశాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు అందజేసి నీటి వసతిని కల్పిస్తారు. అటవీ హక్కుల చట్టం 2006 కింద 6.69 లక్షల ఎకరాలపై 2,30,735 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడు పట్టాలు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు, 23,886 ఎస్టీ రైతులకు చెందిన 69,039 ఎకరాల భూమికి వివిద పథకాల కింద రూ.141.57 కోట్ల వ్యయంతో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారు. మిగిలిన 2.10 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6లక్షల ఎకరాల భూములకు విద్యుత్ సౌకర్యం లేదు. వీటికి పూర్తిస్థాయి రాయితీతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీటి వసతిని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
COMMENTS