PM Modi: Good News of Modi Sarkar. Full pension for all of them now!
PM Modi: మోడీ సర్కార్ గుడ్న్యూస్.. ఇకపై వారందరికి ఫుల్ పెన్షన్!
పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారని తెలిపారు. సర్వీసులో 25 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పూర్తి పెన్షన్ స్కీమ్ను తీసుకువచ్చింది కేంద్రం. బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 11,12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ప్రవేశపెట్టడం ద్వారా పెన్షన్ వ్యవస్థలో కీలక సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యూ పెన్షన్ స్కీమ్ (NPS)లో మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. 2000వ దశకం ప్రారంభంలో అమలు చేసిన ఎన్పీఎస్ గ్యారంటీ పెన్షన్ మొత్తాన్ని అందించకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి ఆర్థిక భద్రత గురించి అనిశ్చితిలో పడ్డారు.
కేంద్ర కేబినెట్ ఆమోదం:
నూతన పింఛను పథకం (NPS) లో మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయడంతో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలు, దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కు పైగా సమావేశాలు నిర్వహించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంకు సహా అందరితో సంప్రదింపుల అనంతరం ఏకీకృత పెన్షన్ పథకానికి కమిటీ సిఫారసు చేసింది. ఈ ఏకీకృత పెన్షన్ పథకానికి (Unified Pension Scheme) కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఇది త్వరలో అమలు కాబోతోంది.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ముఖ్యాంశాలు:
ఈ యూపీఎస్ (UPS) లో అత్యంత కీలకమైనది వేతనంలో 50% పెన్షన్ గా ఇస్తామన్న హామీ. ఇది పదవీ విరమణ అనంతర ఆదాయం కోసం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక డిమాండ్ ను నేరుగా పరిష్కరిస్తుంది. కుటుంబ పెన్షన్, కనీస పెన్షన్ వంటివి ఇతర ముఖ్యమైన హామీలు. ఇవి పదవీ విరమణ అనంతరం ఆ ఉద్యోగికి ఆర్థిక భద్రతను మరింత పెంచుతాయి.
చివరి 12 నెలల సగటు:
కొత్త స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన వారికి పదవీ విరమణకు ముందు చివరి 12 నెలల సర్వీస్ నుంచి వారి సగటు మూల వేతనంలో 50% పెన్షన్ గా లభిస్తుంది. కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి కోసం ఈ బెనిఫిట్ ను రూపొందించారు. 25 ఏళ్ల లోపు, 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులకు సర్వీసు కాలానికి అనుగుణంగా పెన్షన్ ఉంటుంది.
60% కుటుంబ పెన్షన్:
ఆ ఉద్యోగి మరణిస్తే, అతడు మరణానికి ముందు పొందుతున్న పెన్షన్ (PENSION) లో 60% మొత్తాన్ని వారి కుటుంబానికి పెన్షన్ గా ఇస్తారు. ఈ నిబంధన ఉద్యోగిపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
మినిమమ్ పెన్షన్:
ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే నెలకు రూ .10,000 కనీస పెన్షన్ కు కూడా ఈ పథకం హామీ ఇస్తుంది. తక్కువ వేతన స్కేలు కలిగిన ఉద్యోగులకు దీనితో ప్రయోజనం కలుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం, పదవీ విరమణ తర్వాత నెలకొనే ఆర్థిక అనిశ్చితుల నుండి రక్షణ కల్పిస్తుంది.
COMMENTS