Success Story: Rubies in the soil.. both sisters as SI'S...
Success Story: మట్టిలో మాణిక్యాలు.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎస్సైలుగా...
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెలు ఒకేసారి ఈ పోస్టులకు అర్హులు కావడం పట్ల పలువురు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ జిల్లాలో మట్టిలో మాణిక్యాలు ఆ ఇద్దరు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అక్క, చెల్లి తండ్రి పడే కష్టాన్ని ఎంత త్వరగా తీర్చాలి కంకణం కట్టుకున్నారు. సరస్వతి దేవి సైతం ఈ విద్యార్థినిల గోడు ఆలకించడంతో వారు ఊహించిన విధంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లకే ఒకేసారి ఒక ఊరికి సేవా శాసించే ఉద్యోగాలు అందాయి. దీంతో మట్టిలో మాణిక్యాలు అంటూ ఆ గ్రామంలో సందడి ప్రారంభమైంది. జిల్లా ప్రజలంతా ఆ విద్యార్థినిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ విద్యార్థులు ఏం ఘనత సాధించారు. ఆ మట్టిలో మాణిక్యాలుగా ఎలా ఎదిగారు. ఆ తండ్రి ఏం చేసి విద్యార్థులు తీర్చిదిద్దాడు ఒకసారి చూద్దాం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం గ్రామానికి చెందిన చికెన్ వ్యాపారి…నిరుపేద కుటుంబం చిన్నప్పటి నుంచి తనకి ఉన్న ఇద్దరు అమ్మాయిలని రెక్కల కష్టంపై పెంచుకుంటూ చికెన్ అమ్ముతూ ఇద్దరు పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలని సంకల్పంతో నడుంబిగించాడు. చలి, ఎండ వాన ఇవేమీ లెక్కచేయకుండా వ్యాపారం చేస్తూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించాడు.
ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు కూడా తన తండ్రి ఎంతో కష్టపడి తమను చదివిస్తున్నాడు, తన తండ్రికి మనం ఉద్యోగం చేసి ఆయనకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనే సంకల్పంతో నడుం బిగించారు. ఊహించని విధంగా ఒక్కసారిగా ఇద్దరు అక్కచెల్లెళ్లకు ఒక పట్టణాన్ని శాసించే అదేవిధంగా సేవ చేసే ఉద్యోగాలు ఏకంగా ఎస్సై పోస్టులకు ఎంపిక అయ్యారు. ఇంకేముంది ఊరు వాడ సంబరాలు ప్రారంభమయ్యాయి. మట్టిలో మాణిక్యాలు అంటూ ప్రాంతంలో సంబరాలు చేసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం గ్రామానికి చెందిన అక్కా చెల్లెల్లు కడలి కరుణ, కడలి రేవతి ఇద్దరు అక్క చెల్లెల్లు. కష్టపడి చదవడం, ఎలా అయినా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని సంకల్పించుకున్నారు. ఇటీవలే వచ్చిన ఎస్సై పోస్టుల రిక్రూట్మెంట్ లో ఇద్దరు విజయం సాధించారు. ఇంకేముంది చదివిన కళ నిజమైంది.
తండ్రికి ఎంతో ఆనందం అనిపించింది. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి చికెన్ అమ్మే తండ్రి ఈరోజు తన ఇద్దరు కుమార్తెలు ఎస్సైలుగా నియామకం అవుతున్న తరుణంలో ఆయన ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా పలువురు ప్రత్యేకంగా విద్యార్థినీలను అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంకల్పం మనలో గట్టిగా దృఢంగా ఉంటే కచ్చితంగా అనుకున్న స్థాయికి వెళ్తామనడానికి నిదర్శనం ఈ మలికిపురం గ్రామానికి చెందిన కరుణ రేవతి అని పేర్కొన్నారు. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెలు ఒకేసారి ఈ పోస్టులకు అర్హులు కావడం పట్ల పలువురు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
COMMENTS