Did you know that train passengers can book rooms like this? The price is also dead cheap..
రైలు ప్రయాణికులు ఇలా రూమ్స్ బుక్ చేసుకోవచ్చని తెలుసా..? ధర కూడా డెడ్ చీప్..
Railways: భారతీయులు విరివిగా ఉపయోగించే రవాణా సాధనాల్లో రైల్వే ప్రథమ స్థానంలో ఉంటుంది. అయితే ఆ శాఖ అందించే కొన్ని సౌకర్యాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. వాటిలో రిటైరింగ్ రూమ్స్ సర్వీస్ ఒకటి. రైలు ఎక్కే ముందు లేదా ప్రయాణం పూర్తైన తర్వాత కొంచెం ఫ్రెష్ అయి వెళ్లిన పని చూసుకునే వారు ఎందరో ఉంటారు. వారు పెద్ద మొత్తం వెచ్చించి బయట హోటల్స్ లో బస చేయాలి. ఇటువంటి వారికి రిటైరింగ్ రూమ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
దేశంలోని అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ సర్వీసును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. సింగిల్, డబుల్ రూమ్స్ తో పాటు డార్మెటరీలు సైతం అందుబాటులో ఉన్నాయి. AC మరియు నాన్-ఏసీలో నచ్చిన రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే సదరు ప్రయాణికుడు ఖచ్చితంగా కన్ఫమ్ టికెట్ కలిగి ఉండాలి.
ఈ రిటైరింగ్ రూమ్స్ ను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు ఇవి కేవలం సోర్స్ మరియు డెస్టినేషన్ స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. IRCTC సైట్ లో లాగిన్ అయ్యి చెక్-ఇన్, చెక్-అవుట్ తేదీలు ఆధారంగా AC లేదా నాన్ AC గదులను బుక్ చేసుకోవచ్చు.డిమాండ్ ఆధారంగా 100 నుంచి 700 వరకు రూమ్స్ రేట్లు మారుతూ ఉంటాయి.
ఏదైనా కారణం రూమ్ రద్దు చేసుకోవాలంటే, బుక్ చేసుకున్న 48 గంటల్లోపు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేవలం 10 శాతాన్ని క్యాన్సిలేషన్ ఛార్జీల కింద వసూలు చేస్తారు. అదేరోజు అయితే 50 శాతం మాత్రమే రీఫండ్ పొందగలం. ఈ రూమ్స్ లో 2 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతిస్తారు. ఒకవేళ టికెట్స్ వెయిట్-లిస్ట్లో ఉంటే రూమ్స్ బుక్ చేసుకోవడానికి అనుమతించరు.
COMMENTS