1324 Junior Engineer Govt Jobs in Staff Selection Commission
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 1324 జూనియర్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి జూనియర్ ఇంజినీర్స్ ఉద్యోగ నియామకాలకు సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు / శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
పోస్టులు : గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్.
నియామకాలు- విభాగాలు: జూనియర్ ఇంజినీర్గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, కేంద్ర జల, విద్యుత్ రిసెర్చ్ స్టేషన్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్వేస్ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఖాళీల వివరాలు: 1324
అర్హతలు: డిప్లొమా (సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ, బీఈ / బీ.టెక్ (సివిల్ / మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.
వయోపరిమితి: పోస్టులకు అనుగుణంగా 18 – 32 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం sc/st, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
జీత భత్యాలు: సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.
ఎంపిక విధానం: పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1 ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్-2 ఆఫ్లైన్లో జరిగే (డిస్క్రిప్టివ్) రాత పరీక్ష. పేపర్-1 లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2లో పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్ పరీక్ష. పేపర్-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 26, 2023
దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 16, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్, 2023.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
COMMENTS