Electricity bill: Current bills to be reduced..Electricity rules revised by Centre!
Electricity bill: తగ్గనున్న కరెంట్ బిల్లులు..ఎలక్ట్రిసిటీ రూల్స్ సవరించిన కేంద్రం!
Current bill: ఇప్పటికీ మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉంటున్న విషయం తెలిసిందే. కరెంట్ కోతలుంటున్నాయ్ గానీ కరెంట్ బిల్లులో మాత్రం కోత ఉండట్లేదు.
కరెంట్ బిల్లు మాత్రం భారీగానే ఉంటోంది. అయితే విద్యుత్తు వినియోగదారులకు ఊరట కలిగించేలా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020(Electricity(rights of consumers)rules,2020)లో సవరణలు చేసింది. ఈ చర్య ద్వారా..విద్యుత్తు బిల్లుల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
టైమ్ ఆఫ్ డే (ToD)టారిఫ్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ టారిఫ్ సిస్టమ్లోని మార్పులు అమలులోకి రానున్నాయి. టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అనేది గరిష్ట విద్యుత్తు డిమాండ్ 10 కిలోవాట్లు అంత కన్నా ఎక్కువగా ఉండే కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే వ్యవసాయ వినియోగదారులు మినహా మిగిలిన వినియోగదారులకు ఏప్రిల్ 1, 2025 నుంచి అమలు అవుతుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే వారికి పవర్ టారిఫ్ అనేది సోలార్ హవర్స్లో 20 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే పీక్ హవర్ లో 10 నుంచి 20 శాతం ఎక్కువగా ఉంటుంది. టీఓడీ నియమాలను కచ్చితంగా పాటించే వారికి బెనిఫిట్స్ ఉంటాయని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెలిపింది. టీఓడీ అనేది కన్జ్యూమర్లు తమ ఎలక్ట్రిసిటీ బిల్స్ను తగ్గించుకునేందుకు వీలు కల్పిస్తుందని, విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థలు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుందని తెలిపింది.
మరోవైపు,కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ పట్టణం భాగ్యనగర్లో నివసించే ఒంటరి వృద్ధురాలి ఇంటికి ఏకంగా 1లక్షా 3వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. వృద్ధురాలు గిరిజమ్మకు లక్ష బిల్లు రావడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వృద్ధురాలు గిరిజమ్మ మీడియాతో మాట్లాడుతూ భాగ్య జ్యోతి పథకం కింద కరెంటు తీసుకున్నామని నెలకు రూ.50-70 మాత్రమే వచ్చేదని తెలిపింది. అయితే ఒక్కసారిగా లక్ష వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు బల్బులు మినహా ఫ్యాన్, మిక్సీ వంటివి కూడా లేవన్నారు. ఆరునెలలుగా తగిన డబ్బులు లేక బిల్లు కట్టలేదన్నారు. విషయం కాస్త వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలకు నడుం బిగించారు. కొప్పళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ నేరుగా గిరజమ్మ ఇంటికి వెళ్ళి పరిశీలించారు. ఏదో పొరపాటు జరిగిందని.. లక్ష బిల్లు చెల్లించాల్సిన పనిలేదని భరోసా ఇవ్వడంతో ఆమె ఊరట చెందింది.
COMMENTS