IAS Selection Process: How many people are selected for IAS every year..? Know how the selection process is..
IAS Selection Process: ఐఏఎస్కు ఏటా ఎంత మంది సెలక్ట్ అవుతున్నారు..? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి..
దేశంలో ప్రస్తుత పాలనా అవసరాలకు తగ్గట్టు ఐఏఎస్లు సరిపడా ఉన్నారా? ఏటా మంది ఎంపిక అవుతున్నారు? తదితర వివరాలు పరిశీలిద్దాం.
భారత్లోని అత్యంత కఠినమైన పరీక్షల్లో సివిల్స్ ఒకటి. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ((IAS), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS)కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఎంపికయ్యే వారు పాలనా యంత్రాంగాన్ని నడిపించాల్సి ఉంటుంది. అయితే దేశంలో ప్రస్తుత పాలనా అవసరాలకు తగ్గట్టు ఐఏఎస్లు సరిపడా ఉన్నారా? ఏటా మంది ఎంపిక అవుతున్నారు? తదితర వివరాలు పరిశీలిద్దాం.
సివిల్స్ కోసం వేల మంది అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐఏఎస్కు ఎంపికయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో సివిల్స్ పరీక్ష విధానం, వయోపరిమితి వంటి అంశాలపై లోతుగా చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట బస్వాన్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి బీఎస్ బస్వాన్ చైర్మన్గా వ్యవహరించారు.
ఈ కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. ప్రస్తుత పాలన అవసరాల కోసం 569 మంది ఐఏఎస్లు తక్కువగా ఉన్నారని, ఏటా 180 మంది IAS అధికారులను ఎంపిక చేయాలని సూచించింది. అవసరమైతే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో ఐఏఎస్ అధికారులకు ఇచ్చే ట్రైనింగ్ స్టాండర్డ్స్ను సరళీకరించుకోవచ్చని కమిటీ రిపోర్ట్ పేర్కొంది.
అన్ని రాష్ట్రాల్లోనూ లోటు
ఆంధ్రప్రదేశ్కు 211 ఐఏఎస్లు అవసరం కాగా, ప్రస్తుతం 170 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 41 మంది ఐఏఎస్ల సేవలు అవసరం ఉంది. తెలంగాణకు 208 ఐఏఎస్లు అవసరం కాగా, ప్రస్తుతం 130 మంది మాత్రమే ఉన్నారు. ఐఏఎస్ అధికారుల లోటు 78గా ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 106 మంది ఐఏఎస్ అధికారుల లోటు ఉండటం గమనార్హం.
ఐఏఎస్ అధికారి సెలక్షన్ ప్రాసెస్
ఐఏఎస్ అధికారి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే రెండో దశలో మెయిన్స్, తరువాతి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. అన్నింట్లో మెరిట్లో నిలిచిన వారిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం LBSNAAకు పంపి అవసరమైన ట్రైనింగ్ ఇస్తారు. ఇది రెండు ఏళ్ల పాటు ఉంటుంది. మొదటి మూడు నెలలు ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) కోసం ఎంపికైన అభ్యర్థులతో పాటు ట్రైనింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో 180 మంది ఐఏఎస్ అభ్యర్థులు ట్రైనింగ్లో ఉన్నారు.
COMMENTS