Poleramma Vrathamu
పోలేరమ్మ వ్రతము
భాద్రపద బహుళ అమావాస్య నాడు ఈ పండుగ/వ్రతము స్త్రీలు చేస్తారు . ఈ సం.ము 2009 సెప్టెంబర్ 18 న అమావాస్య .
శక్తి ఆరాధనలో సకలశక్తి స్వరూపిణి అయిన దేవిని పరబ్రహ్మము లేదా ఆదిపరాశక్తిగా అర్చిస్తారు. ఇక్కడ త్రిదేవి అనబడే దేవి స్వరూపచిత్రణ చూపబడింది. ఈమె సరస్వతి, లక్ష్మి, పార్వతిలు కలసిన పరమశక్తిగా కనిపిస్తుంది.
హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులుగానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులుగానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులుగానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.
ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరవాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది.
గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఈమెను తెలంగాణాలో పోచమ్మగాను , కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పోలేరమ్మగాను జనులు పిలుస్తున్నారు.గ్రామ సరిహద్ధులను కాపాడే దేవత కనుక ఈమెను పొలిమేరమ్మగాను. పోలేరమ్మగాను పిలుస్తూ, కొలుస్తూ పూజిస్తున్నారు. గ్రామశక్తి పోలేరమ్మ ఆంధ్ర దేశంలో ఇలవేల్పుగాను, కులవేల్పుగాను, గ్రామవేల్పుగాను ఆరాధింపబడుతున్నది. జగతిని జాగృత్వం చేసి, ప్రగతికి మార్గం చూపేదే మహిళ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు, ప్రగతిశీల భావాలు వర్ధిల్లిన కాలం సింధూ నాగరికధ కాలం. ప్రపంచ నాగరికత దేశాలతో పోటీ పడి సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతితోపాటు పట్టణ నాగరికతను విశిష్టంగా కలిగిందే సింధు నాగరికత. ఇది మాతృస్వామిక దేశం. మహిళ అన్న పథానికి ‘ మహిళా భూమి ’ అని చెప్పడం జరిగింది. మహిళ అనే పదము మహి మరియు ఇలా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. మహీ అంటే స్ర్తీ అని, ఇలా అంటే భూమి అని వెరసి దా ల్యాండ్ ఆఫ్ ఉమెన్ అని స్పురింప చేస్తున్నది.
పోలేరమ్మ కధ :
శ్రీమత్ కైలాస పర్వతం మీద ఈశ్వరుడు , పార్వతి ... ప్రధమ గణములతో కూర్చున్న సమయమున పార్వతి శివునితో ఒక సంగతి అడిగెను .. " మహాత్మా తమరు సమస్త లోకములు పరిపాలించు కర్తలు , ఏకనిదానముతో ఉన్నా వారైనందున తమకు తెలియని అంశములు ఏమియు లేవు . కృత , త్రేతా, స్వపర , కలియుగములో చివరిదైన కలియుగములో స్త్రీలు మిక్కిలి పాపత్ములుగాను , సంతానలేమివరుగాను కాగలరు అని భవిస్య వాని చెప్పుతున్నందున పుణ్యము నిచ్చే ఒక వ్రతమును చెప్పుమని కోరగా .. ఈ పోలేరమ్మ వ్రతము ను చెప్పెనని అందురు."
COMMENTS