World Tourism Day
ప్రపంచ పర్యాటక దినోత్సవం-- సెప్టెంబర్ 27న : దేశ ఆర్ధిక ప్రగతిని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి . ఆయా దేశాల్లో గల్ ఆర్ధిక , మానవ వనరులే ఆ దేశాభివృద్ధికి మూలము . . . వాటిని గుర్తించి సరైన విధంగా ఉపయోగించుకోవాల్సిన భాధ్యత పాలనా యంత్రాంగాలపై ఉంటుంది . ప్రతి ఖండములోనూ , ప్రతి దేశములోనూ చూడదగ్గ అందమైన ప్రదేశాలు , కట్టాడాలు అనేకము ఉంటాయి . . . వాటిని అభివృద్ధిపరచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయవనరులుగా తీర్చి దిద్దాలి . అంతర్జాతీయ వాణిజ్యములో టూరిజం కీలకపాత్ర పోసిస్తూఉన్నది . ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీని " ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషం " (The world tourism Organazation) ఏర్పాటు చేసినది . పర్యాటక విధాన సంబంధిత అంశాల్లొ ఈ అంతర్జాతీయ టూరిజం సంస్థ ప్రపంచ వేదికగా పనిచేస్తుంది . పర్యాటక విభాగం లో " గ్లోబల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ " అమలును ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది . ఈ సంస్థ లో 154 దేశాలు , 7 టెరిటరీలు సభ్యత్వం కలిగిఉన్నాయి . ప్రవేటు రంగము , విద్యాసంస్థలు , టూరిజం అసోసియేషన్లు , స్థానిక టూరిజం అధారిటీల నుండి 400 మంది అఫిలియేట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ప్రధాన కార్యాలము ' మాడ్రిడ్ ' లో ఉన్నది . 1947 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ (IUOTO) తొలి సమావేశము జరిగింది .
1970 ప్రాంతంలో యుఎన్డబ్ల్యుటిఒ్(UNWTO) శిల్పాల పరిరక్షణ బాధ్యతను చేపట్టారు. ‘గ్లోబల్ టూరిజం’లో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజది. ఆ తర్వాత 1980లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు ‘ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని’ సెప్టెంబర్ 27న నిర్వహించ నారంభించారు. అప్పట్నుంచీ - ఒక్కో సంవత్సరం ఒక్కో కాన్సెప్ట్ పేరిట నిర్వహిస్తూ వచ్చారు. 1980లో - 'టూరిజం కంట్రిబ్యూషన్ టు ది ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ టు పీస్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్’ అని పేరు పెట్టారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తోంది.
ప్రభుత్వ సంస్థలు, అనేక ప్రైవేటు సంస్థలు ఉద్యోగుల రిక్రియేషన్కి ఎల్టిసి ల సదుపాయం కల్పించిన తర్వాత - పర్యాటక రంగం ఎంతగానో పుంజుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక స్థలాలను మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఎపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్-- పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాఛీన దేవాలయాలకు, శిల్పకళలకు, చారిత్రక కట్టడాలకు, ప్రముఖ ప్రర్యాటక , పుణ్యక్షేత్రాలు, దర్శనీయ కేంద్రాలకు సంబంధించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు ., మన వారసత్వ సంపద, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు . , జిల్లా పర్యాటకాభివృద్ధి మండలి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించి, పర్యాటకాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోంది .కళలు, చిత్రలేఖనం, చేతితో తయారు చేసిన వస్తువులు తదితర ఆంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది ., అలాగే పర్యాటక అభివృద్ధి పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చర్చ నిర్వహించడం జరుగుతుంది .
మన దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు సహజ పర్యాటక ప్రాంతాలు మరే దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. కాని పర్యాటక రంగానికి తగినన్ని నిధులు, దాని పట్ల తగినంత శ్రద్ద పెట్టకపోవడం వలన మనం ఆశించినంత గొప్పగా ఈ రంగం మన దేశంలో అభివద్ధి చెందలేదు.
COMMENTS