World Wetlands Day
ఈ రోజు (ఫిబ్రవర్ 02) - ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం - గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
చిత్తడినేలలు అనే పదం విన్నవారే తక్కువ . ఇక ఆ చిత్తడినేలల ప్రాముఖ్య గురించి తెలిసిన వారు బహు తక్కువ . దాను ఫలితమే అతి వేగంగా అంతరించిపోతున్న చిత్తడినేలలు , భౌగోళికపరంగా , జీవ వైవిధ్య పరంగా చిత్తడినేలలు ఎంతో కీలకమైనవి . సముదర తీరప్రాంతాలలొనైనా , నదుల ప్రాంతాలలొనైనా సంవత్సరం లో అధిక కాలము నీరు నిలిచివుండి , తోతు తక్కువగా ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు గా పిలుస్తారు . మంచినీటి , ఉప్పునీటి సరస్సులు , మడ అడవులలు కలిగిన సాగర సంగమ ప్రాంతాలు , బురద కయ్యలు , ఉప్పునీటి కయ్యలు , ప్రవాహాలు కలిగిన ప్రాంతాలు వంటివన్నీ చిత్తడి నేలల కిందకే వస్తాయి .
జలవనరులు మానవాళి మనుగడకు ఎంతో కీలకం . అందుకే మానవ సంస్కృతి నదీ తీరాలలోనే విలసిల్లినది . సింధు , గంగానది , కృష్ణానదీ , గోదావరీ నదీతీరాలలోనే విలసిల్లినది . నేడు మహానగరములు గా భాసిల్లుతున్న కలకత్తా , ముంబయి , చెన్నై , టొకియో, న్యూయార్క్ వంటివన్నీ జలవనరుల ఆధారముగా ఎదిగినవే , అన్ని దిక్కులనుండి అక్కడికి ప్రజలను ఆకర్షించడానికి మూలము ఆ నగరాల ఆర్ధికసంపద అయితే , ఆ ఆర్ధిక సంపదను అందించినది ఆ ప్రాంతాలలో ఉన్న చిత్తడి నేలలే . ఒక ప్రాంత ఆర్ధికవ్యవస్థలో చిత్తడి నేలలు కీలక పాత్ర వహిస్తాయి. సముద్రతీరం లో ఉన్న చిత్తడినేలలు ఆ ప్రదేశానికి స్థిరత్వాన్నిస్తాయి . అలల తాకిడికి ఆ ప్రాంతం దెబ్బతినకుండా రక్షిస్తాయి . నదులప్రాంతం లో అయితే చిత్తడినేలలు వరదముంపుల నుండి రక్షిస్తాయి . చిత్తడినేలలు అనేక వందల రకాల మొక్కలు , జంతువులకు మెరుగైన ఆశ్రయాన్నిస్తాయి .
చేపలు , రొయ్యలు వంటి అనేక నీటిజాతులకు గుడ్లు పెట్టేందుకు , పిల్లలు ఎదిగేందుకు సౌకర్యము కల్పిస్తాయి . ఆయా ప్రాంతాలలో ఉండే నీటి నాణ్యతను పెంచడంలోనూ చిత్తదినేలలు పాత్ర వహిస్తాయి. ఆ ప్రదేశాలలోకి వదలబడిన కాలుష్యకారకాలను గ్రహిస్తాయి. ఇన్ని లాభాల్ని అందించే చిత్తడి నేలల విలువను డబ్బు రూపం లో లెక్కకడితే కొన్ని లక్షలకోట్ల రూపాయల్లో ఉంటుంది . నీటికి , భూమికి అనుసంధాన ప్రాంతంగా ఉండే ఈ చిత్తడినేలల ప్రాముఖ్యతను అర్ధము చేసుకోలేకపోయిన ప్రజలు తమ ఆవాసాల విస్తరణలో చిత్తడి నేలలను మింగేయసాగారు . ముంబయి నగరం ఈ స్థాయికి విస్తరించిందంటే దానివెనక మాయమయిన చిత్తడి నేలలనేకము ఉన్నాయి . చిత్తడి నేలలు ఆక్రమించి , మట్టితో కప్పి తమ భవన నిర్మాణానికి వాడుకోవడం మొదలు పెట్టేరు . ఒకప్పుడు చిత్తడి నేల ఆడవులుగా ఉన్న ముంబయి ప్రాంతం లో నేడు కాంక్రీటు భవనాలు నిలిచాయి . ఇది కేవలము మనదేశానికి సంబంధిన సమస్యకాదు . ప్రపంచవ్యాప్తం గా పారిశ్రామిక అభివృద్ధితో తరిగిపోతున్న చిత్త్డినేలలను గుర్తించి అంతర్జాతీయ వేదిక ఒక ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది .
1971 ఫిబ్రవరి 02 న చిత్తడి నేలల మీద ప్రపంచ దృష్టి మళ్ళించే సదస్సు ఇరాన్ దేశములో రామ్సార్ పట్టణములో జరిగింది . కాస్పియన్ సముద్రతీరం మీదున్న అ రామ్సార్ జరిపిన చర్చల ఫలితం గా ప్రపంచం లోని దేశాలన్నీ తమ తమ దేశాల్లోని కీలక చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణ కు అవసరమైన చర్యలు చేపట్టాలని తీర్మాణము చేసారు . ప్రత్యేక చట్టాలతో వాటిని రక్షించాల్సిన భాద్యత ప్రభుత్వాలపైన పెట్టింది . అయినా చిత్తడి నేలల మీద దృస్టి 1997 వరకు కేంద్రీకరించబడలేదు .
తొలిసారిగా ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని 1997 లో ఫిబ్రవరి 02 న జరిపారు . నాటి నుండి ప్రతియేటా ఈ దినోత్సవం జరుగుతోంది .
భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇవి 4.63 శాతం వరకు ఉండటం విశేషం. వీటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్ల్యాండ్స్ డేను నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవానికి ‘చిత్తడి నేలలు, నీరు’ (వెట్ ల్యాండ్స్ అండ్ వాటర్) అనే థీమ్ను యునెస్కో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వీటి పరిరక్షణ కోసం రామ్సార్ కన్వెన్షన్ను రూపొందించారు. మన దేశం 1982లో ఇందులో చేరింది. నదులు, సరస్సులు, డెల్టాలు, ఉపరితల నీటి వనరులు, పగడపు దీవులు వంటివన్నీ చిత్తడి నేలల కిందకు వస్తాయి. కొన్ని సీజనల్గా ఏర్పడతాయి. మరికొన్నింటిని మనుషులు అవసరాల కోసం నిర్మిస్తున్నారు. నీటి స్వభావంతో సంబంధం లేకుండా, వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల లోతు ఆరు మీటర్లకు మించని వాటిని చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. కాలుష్యం పెరగడం, పట్టణీకరణ, అభివృద్ధి వంటి కారణాల వల్ల భారతదేశంలో సహజంగా ఏర్పడిన చిత్తడి నేలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భారత్ ఇప్పటికే మూడింట ఒక వంతు చిత్తడినేలలను కోల్పోయిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వీటిని కాపాడుకోవాలని, ప్రభుత్వం ఇందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.
చిత్తడి నేలలను ఎందుకు సంరక్షించుకోవాలంటే…
చిత్తడి నేలలు హైడ్రలాజికల్ సైకిల్కు మూలాలు. నీటి నిల్వ, శుద్ధి చేయడాన్ని ఇవి సులభతరం చేస్తాయి. వీటిని సంరక్షించకపోతే ఇలాంటి సహజ ప్రక్రియలకు అవరోధాలు కలుగుతాయి. చిత్తడి నేలలు ఎంతోమంది ప్రజలకు జీవనాధారంగానూ ఉన్నాయి. ఇవి వరదల బారిన పడకుండా కాపాడతాయి. తుఫానుల వంటివి ఏర్పడినప్పుడు నీటిని సంరక్షించేందుకు, వర్షపు నీటిని నిల్వచేసేందుకు ఇవి తోడ్పడతాయి. వీటిని కాపాడకపోతే ప్రకృతి విపత్తులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు కాలుష్య నివారణకు కూడా ఇవి సహాయపడతాయి. చిత్తడి నేలలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సాధనాలుగా పనిచేస్తాయి. వీటిల్లో పెరిగే వివిధ రకాల మొక్కలు ఆక్సిజన్ అవసరాలను తీరుస్తాయి. జీవ వైవిధ్యానికి, మనిషి మనుగడకు చిత్తడి నేలలు కృషి చేస్తున్నాయి. అందువల్ల వీటి సంరక్షణ కోసం నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
COMMENTS