National Sports Day 2020: హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ గురించి ఈ విషయాలు తెలుసా?
National Sports Day 2020: హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ 117 జయంతి నేడు. ఆయన పుట్టిన రోజునే దేశంలో జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకుంటున్నారు. దేశానికి మూడు ఒలంపిక్స్ పతకాలు అందించిన ధ్యాన్ చంద్ గురించి నేటి తరానికి పెద్దగా తెలియని కొన్ని అంశాలు..
నేడు భారత జాతీయ క్రీడా దినోత్సవం. ప్రతీయేటా హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 1905 ఆగస్టు 29న ధ్యాన్చంద్ జన్మించారు. మెరుపువేగంతో గేల్స్ చేయగల మాంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు. మైదానంలో పాదరసంలా కదిలిపోతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. 1928 ఆమ్స్టర్డామ్,1932 లాస్ ఏంజిలెస్,1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్లో భారత్కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్చంద్కే దక్కింది. ధ్యాన్చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పతకాలు నెగ్గింది.
హాకీలో భారత్కు చారిత్రాత్మక విజయాలు అందించడంతో పాటు,ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు.భారత్లోనే అసలు సిసలు క్రీడా దిగ్గజంగా ధ్యాన్ చంద్కు పేరుంది. ధ్యాన్చంద్ 117వ జయంతి సందర్భంగా ఆయన క్రీడా రంగ సేవలను యావత్ దేశం మరోసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ధ్యాన్చంద్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు..
1956లో తన 16వ యేట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు
చంద్రుడి వెలుతురులోనూ ఆయన ప్రాక్టీస్ చేసేవారు. అందుకే ఆయన్ను చంద్గా పిలిచేవారు.
1936నాటి ఒలంపిక్స్లో జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్లో ద్వితీయార్థంలో ధ్యాన్ చంద్..తన షూ, సాక్స్ను తీసేసి మ్యాచ్ ఆడారు. అయినా మూడు గోల్స్ సాధించి భారత్కు ఒలంపిక్స్ పతకాన్ని అందించాడు.
1936నాటి ఒలంపిక్స్ సందర్భంగా బెర్లిన్లో పెద్ద ఎత్తున ధ్యాన్ చంద్ పోస్టర్లు వెలిశాయి. ధ్యాన్ చంద్ ఆట చూసేందుకు స్టేడియంకు రావాలంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
- ధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధుడైన హిట్లర్...ఆయనకు జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కీలక పదవిని ఆఫర్ చేశారు.
- ధ్యాన్ చంద్కు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. చేపల కూరను తనే వండి స్నేహితులకు వడ్డించేందుకు ఇష్టపడేవారు.
- ఓ మ్యాచ్ సందర్భంగా ధ్యాన్ చంద్ ప్రత్యర్థులపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. గోల్ పోస్ట్ విషయంలో రిఫరీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిశీలనలో గోల్ పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది.
-2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణం చేశారు. అలాగే అలిఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని ఓ హాస్టల్కు ఆయన పేరు పెట్టారు. లండన్లోని ఇండియన్ జింకానా క్లబ్కు ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.
- ధ్యాన్ చంద్ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకు ఆ గౌరవాన్ని పొందిన ఏకైక భారత హాకీ క్రీడాకారుడు ఆయన ఒక్కడే.
-2014లో భారత రత్న పురస్కారం కోసం నామినేట్ అయిన వారిలో ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనకు ఆ దేశ అత్యుత్తన్న పౌరపురస్కారం దక్కలేదు. ధ్యాన్ చంద్కు ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం దక్కకపోవడం ఆయన కుటుంబీకులతో పాటు క్రీడాభిమానులకు నిరుత్సాహానికి గురిచేసే అంశమే.
COMMENTS