విహార దీవుల సమ్మేళనం.. లక్షద్వీప్!
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం లక్ష ద్వీప్. వెండి వెన్నెల చిన్నబోయేలా .. మిరుమెట్లు గొలిపే తెల్లని ఇసుక తిన్నెలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.
ఎటుచూసినా దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తాయి. సందర్శకుల సాహస క్రీడలకు స్వర్గధామంలాంటిది లక్షద్వీప్. స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలిని వర్ణించడానికి మాటలు చాలవు.
పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగు సముద్రం లక్ష ద్వీప్. వెండి వెన్నెల చిన్నబోయేలా .. మిరుమెట్లు గొలిపే తెల్లని ఇసుక తిన్నెలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఎటుచూసినా దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తాయి. సందర్శకుల సాహస క్రీడలకు స్వర్గధామంలాంటిది లక్షద్వీప్. స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలిని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలే దీవులుగా పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లక్షద్వీప్ పర్యాటక విశేషాలు మీకోసం..!
మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్నది లక్షద్వీప్లు. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలో మీటర్లకు మించదు. ఇక్కడ 36 దీవులున్నప్పటికీ పది దీవులే జనావాసాలు ఉంటాయి. పది సబ్ డివిజన్లు కలిగిన ఒకే ఒక జిల్లా ఇది. పది దీవుల్లో జనాభా సంఖ్య లక్షకు మించి మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళం. అయితే చాలా మంది హిందీ మాట్లాడతారు. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు కనిపిస్తుంది. ప్రజల జీవనశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. పురుషులు మలయాళీల వస్త్రధారణలో, స్త్రీలు రంగురంగుల బుర్ఖాలు ధరిస్తారు. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ.
పర్యాటకమే పెద్ద పరిశ్రమ..
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కవరట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన 'ట్యూనా ఫిష్' ఇక్కడి నుండి పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం పర్యాటకమే పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు.
ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే. ది ఆమీన్ గ్రూప్ ద్వీపాలు, లక్షద్వీప దీవులు ఈ రెండింటి మధ్య సముద్రాంతర భాగ సంబంధం ఉంది. 200 కిలోమీటర్ల వెడల్పైన నైన్ డిగ్రీ కెనాల్ దక్షిణ భాగంలో ఉన్న మినికారు ద్వీపంలో ఉన్న ద్వీపాలన్నీ పగడపు రాళ్ళతో నిర్మితమై ఉంటాయి. ఇవి భారతీయ పగడపు దీవులుగా ప్రసద్ధి చెందాయి. లక్షద్వీప్ దీవుల్లో మనుషుల సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగు పెడు తుంటారు.
జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ..
అగట్టి, బంగారు దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి. ఫెర్రీ క్రూయిజ్లో ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే చాలు అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సముద్రం లోపలికి దూసుకెళ్లే స్కూబా డ్రైవింగ్ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకొని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు
అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయమేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు 'సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...' వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసేందుకు శిక్షణపొందిన డైవర్స్ అందుబాటులో ఉంటారు.
అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది.
అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం 'పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ' కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు.
అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది. అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం 'పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ' కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు.
కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం.
సాహసోపేతమైన ఆటలు...
దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్ (తెడ్డు పడవ)తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఎన్నో సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు మాత్రం నీలిరంగులో స్వచ్ఛంగా కనిపిస్తుంది. చిన్న చిన్న దీవులైన అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కవరట్టి, కిల్టాన్, మినికోరు... దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయొచ్చు. సాహసాలకు నెలవు... కామత్ ఐలాండ్లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్. స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల స్పోర్ట్స్ ఉన్నాయి.
చేపల మ్యూజియం..
కవరట్టి దీవి అన్నింటికన్నా పెద్దది. ఈ దీవిలో 11 వేల జనాభా ఉంటుంది. ఇళ్లు అధునాతనంగా ఉంటాయి. ఇక్కడ స్కూ బా డైవింగ్ ఫెమస్. సముద్రంలోని రకరకాల జీవరాసులు కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం. స్కూ బా డైవింగ్లో ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న జీవరాశుల్ని చూపించడానికి తీసుకెళ్తారు. రంగురంగుల చేపలు చాలా కనిపిస్తాయి. సముద్రం అడుగున ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. స్కూ బా డైవింగ్ చేయని వాళ్లు తీరందగ్గరే ఉండి వాటర్ స్కూటర్, నీబోర్డు క్రీడలతో ఆడుకుంటారు. ఇక్కడికి దగ్గర్లో ఫి షరీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన మ్యూజియంలో వందల రకాల చేపల్ని ప్రదర్శనకు ఉంచారు. పక్కన మరో భవనంలో సొరచేపల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళలో జానపద నృత్య కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తాయి.
సముద్రతీర వృక్షసంపద ..
సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హౌమ్, లక్షద్వీప్ హౌమ్స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల నుండి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టులు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశం కేరళకు దగ్గరకు ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ.
వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూ లక్ష సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ప్యాక్టరీలు నడపడానికి వీలుకాదు కనుక ప్రభుత్వం కూడా పర్యాటరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్, కడ్మట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా బంగరమ్ ద్వీపం నిలుస్తోంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది.
చేరుకోవడం ఎలా?
కేరళలోని కొచ్చి నగరానికి దగ్గరగా ఉన్న తీరం లక్షద్వీప్, కొచ్చి నుండి అగట్టి దీవికి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్ బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్లు ఉంటాయి. రైలు మార్గంలో అయితే, కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుండి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది. షిప్ ప్రయాణం చేయాలనుకునేవారు లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుండి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది.
COMMENTS