IGNOU: ఇగ్నో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చివరి తేదీ, ఇతర వివరాలు..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూలై 2022 సెషన్ కోసం ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) ప్రోగ్రామ్లలో ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్లైన్లో జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో ట్విట్టర్లో వెల్లడించింది.
ప్రోగ్రామ్స్ వివరాలు:
వివిధ స్ట్రీమ్లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల కోసం ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. UG ప్రోగ్రామ్లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ ఆనర్స్ సైకాలజీ, బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బీఏ ఆనర్స్ సోషియాలజీ, బీఏ ఆనర్స్ ఆంత్రోపాలజీ ముఖ్యమైనవి. అదేవిధంగా మాస్టర్స్ ప్రోగ్రామ్ స్ర్టీమ్లో... మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA (బ్యాంకింగ్, ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) వంటివి ఉన్నాయి.
అడ్మిషన్ కోసం దరఖాస్తు విధానం:
స్టెప్-1: ఇగ్నో అధికారిక వెబ్సైట్ ignouadmission.samarth.edu.inను సందర్శించాలి.
స్టెప్-2: జూలై-2022 అడ్మిషన్ పోర్టల్ను ఓపెన్ చేసి, ‘క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ను’ను సెలక్ట్ చేయండి.
స్టెప్-3: బేసిక్ వివరాలను ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి
స్టెప్-4: మీ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్కు పంపిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ను నింపండి.
స్టెప్-5: ఈ ఫారమ్లో అన్ని వివరాలను నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
స్టెప్-6: నాన్- రిఫండబుల్ రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించి సబ్మిట్ చేయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు.
ఇగ్నో జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం... ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఒక ప్రోగ్రామ్కు మాత్రమే ఫీజు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి ఫీజు మినహాయింపు కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్లను సమర్పించినట్లయితే, వాటిని ఇగ్నో తిరస్కరిస్తుంది.
MBA and MCA Programmes in ODL Mode. --> CLICKHERE
MBA and MCA Programme in ONLINE Mode -->CLICKHERE
COMMENTS