Chrysanthemum ; చామంతి సాగు మెళకువలు
Chrysanthemum ; వ్యాపార సరళిలో పండించే పూలలో గులాబీ తరువాతి స్ధానం చామంతి దే. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు తక్కువ కాలంలో మంచి దిగుబడుల కొరకు పెంచుతున్నారు. విడిపూలుగా, దండాలు కట్టడానికి, కట్ ప్లేవర్ గా చామంతికి చలికాలం మంచి గిరాకీ ఉంటుంది. పండుగలు, పర్వదినాలు, పూజలకు చామంతులను తప్పని సరిగా వాడుతారు.తక్కువ పెట్టుబడి ,తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను సమకూర్చే చామంతి పూల సాగును రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ నిలకడైన ఆదాయాన్ని సంవత్సరం పొడవునా ఆర్జిస్తున్నారు. చామంతి పూల సాగు విషయానికొస్తే అధిక సేంద్రియ పదార్థం గల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మురుగు నీటి వసతి గల ఒండ్రు నేలలు ఈ పంటకు చక్కటి అనుకూలంగా చెప్పవచ్చు. అధిక వెలుతురు కలిగి ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు చామంతి మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి.
చామంతి శీతాకాలంలో పుష్పిముచే మొక్క అంటే పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే త్వరగా పూతకు వస్తాయి. పగలు ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉండే శాఖీయంగా పెరుగుతాయి. ఈ పూలను పండుగల సమయంలో ఎక్కువగా వినియెగిస్తారు. సాధారణంగా చామంతి సాగు మే, జూన్ నెలలో చేపడితే ఆగస్టు, అక్టోబర్ నెలల్లో పూలు కోతకు వచ్చి అధిక లాభాలను పొందవచ్చు. చామంతి ముక్కలను ఆరోగ్యంగా ఉన్న తల్లి మొక్క నుంచి పిలకలను లేదా కొమ్మలను సేకరించి వ్యాప్తి చేసుకోవచ్చు. దాదాపు ఎకరాకు 65000 పిలకలు నాటడానికి సరిపోతాయి. అయితే వాతావరణాన్ని బట్టి చామంతి సాగులో వివిధ రకాల తెగుళ్లు అధికంగా వ్యాపిస్తాయి. సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
డ్రిప్ ద్వారా నీరు ఇస్తే కలుపు బెడద తక్కువగా ఉంటుంది. 1-2 సార్లు మొక్క దగ్గర మట్టిని కదిలిసై వేరు వ్యవస్ధ బాగా వృద్ధి చెందుతుంది. మొక్క దగ్గర నీరు నిల్వకుండా చూడాలి, లేకుంటే వేరు కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 60-80 కిలోల నత్రజని, 30-40 కిలోల బసవరం, 60-80 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొక్కలను మొదటి 30 రోజులు బాగా ఏపుగా పెరిగేటట్టు చూడాలి. 20 రోజులకొకసారి సుష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేసినటైతే ముక్కలన్నీ ఆరోగ్యంగా పెరుగుతాయి.
పొలంలోని మొక్కలన్నీ సుమారు 30 సెం.మీ. ఎత్తు పెరిగిన తర్వాత మొక్కల తలలు తుంచివేయాలి. ఈ విధంగా చేయటం వలన పక్కకొమ్మలు ఎక్కువగా వస్తాయి, తద్వారా పులా దిగుబడి పెరుగుతుంది. తలలు తుంచి తర్వాత నత్రజని మరియు పోటాష్ లను ఇచ్చే ఎరువులను చామంతి మొక్కలకు అందించటం ద్వారా నాణ్యమైన పులా దిగుబడిని పెంచవచ్చు. పువ్వు సైజ్ పెరగటానికి తలలు కత్తిరించిన 20-25 రోజులకు 50 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం 50 మీ.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.100 పి.పి.యం. నప్తలిన్ ఎసిటిక్ ఆమ్లం 100 మీ. గ్రా. లీటరు నీటికి కలిపి మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చును. 100-150 పి.పి.యం. జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారీ చేస్తే 15-20 రోజులు ముందుగా పూలు కోతకువస్తాయి.
సస్యరక్షణ చర్యలు:
ఆకుమచ్చ తెగులు: ఆకులమీద గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది. తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా.మంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి 3గ్రా. చొప్పున15రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
వేరు కుళ్ళు తెగులు: భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనపడుతుంది.లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి. ఈ తెగులు నివారణ కి కిలో విత్తనానికి 2గ్రా.ట్రైకోడేర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.లేదా కార్బ౦డిజిమ్ 1గ్రా.లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.
తుప్పు తెగులు : చలికాలంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉండి అధిక నష్టం కలుగ జేస్తుంది.ఆకులపై తుప్పు రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత పై ఆకులకు ,పువ్వులోని పచ్చని భాగాలకు వ్యాపించి ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి.తెగులు నివారణకు మాకోజెబ్ 2గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రైతులు మేలైన యాజమాన్యపద్దతులు పాటిస్తే ఎకరాకు 8 నుండి 10 టన్నుల వరకు పూల దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది.
COMMENTS