Chilli Cultivation : మిరప సాగులో మెళకువలు
Chilli Cultivation : వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. దీనిని కూరలో పచ్చికాయలుగా, ఎండు కాయలను పొడి చేసుకొని కారం కోసం వినియోగిస్తారు. మిరప పంట పండించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్తానంలో ఉంది. ఇండియాలో పండించే 13 లక్షల టన్నులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 50 శాతం వాటా అంటే 6.5 లక్షల టన్నులు ఉచ్పత్తి అవుతుంది. దీనిలో ఒక్క గుంటూరు జిల్లా నుండే 3.20 లక్షల టన్నులు అంటే 50 శాతం వాటా పండుతున్నాయి.
వర్షాధారపు పంటకు నల్ల నేలలు, నీటి ఆధారపు పైర్లకు నల్ల నేలలు, చల్కా నేలలు, లంక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6-6.5 ఉన్న నేలలు అనుకూలం. నీటి ఎద్దడికి కొంత వరకు తట్టుకుంటుంది. మిరప 10-35 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఎండు మిరప కోసం వేసే పంటను ఖరీఫ్ లో వేసుకోవడం మంచిది. పచ్చి మిరప కోసం సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.
మిరపసాగు చేసే వారు కొన్ని రకాల మెళుకువలను పాటిస్తే మంచి పంట దిగుబడిని పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రిమకీటకాలు సోకటాన్నితగ్గించే బీన్స్ తోను , తృణధాన్యాలతోను పంట మార్పిడి విధానాన్ని పాదిందాలి. నులి పురుగులను తగ్గించే బంతి మొక్కలను ఉల్లి, వెల్లుల్లిలతో అంతర పంటల విధానాన్ని పాటించాలి. పొలాన్ని వేసవిలో లోతుగా దున్నినట్లయితే భూమిలో దాగి ఉన్న పురుగులు ఫెధోజోన్స్ , నులిపురుగులు వెలుపలికి వచ్చి సూర్యరశ్మికి చనిపోతాయి. పక్షులు వీటిని ఏరుకుని తిటాయి.
ఆఖరు సారి కోత కోసిన తరువాత పంట అవశేషాలను వెంటనే నాశనం చేయాలి. తెగుళ్ళను తట్టుకునే రకాలకు చెందిన ఆరోగ్యవంతమైన , ధృవీకృత విత్తనాలను వాడాలి. సిఫారుసు చేసిన వ్యవసాయ పద్థతులను అనుసరించాలి. పక్క పొలాల్లో మిరప పంటకు ముందు మోనో క్రాపింగ్ ను పొలానాసిమీస్ పంటల సాగును నివారించాలి.
చుట్టుపక్కల పొలాల నుండి పురుగులు ఆశించ కుండా నిరోధించగటానికి మరియు సహజ శత్రువులైన బదనిక పురుగుల వృద్ధికి స్ధావరాలను ఏర్పరచటానికి గాను 2,3 వరుసలు ఏపుగా ఎదిగే మొక్కజొన్న లేదా సజ్జ పైర్లను విధిగా వేయాలి. ప్రధాన క్షేత్రంలో పొగాకు లద్దె పురుగుకు ఆముదం మొక్కలు, శనక పచ్చపురుగుకు బంతి మొక్కలు వంటి ఆకర్షణ పంటలను వేయాలి.
ఆకు మచ్చ తెగులు, ఆకు కుళ్ళు తెగులు , ఎండు తెగులును నరోధించటానికై కిలో విత్తనాల్లో 4గ్రా చొప్పున ట్రైకోడెర్మా విరిడి వంటి ప్రత్యర్ధి ఫంగితో విత్తనాలను శుద్ధి చేయాలి. లేదా వరుసల్లో ఎకరాకు 50 గ్రా పశువుల ఎరువుతో 2గ్రా ట్రైకోడెర్మా విరిడి మందును కలిపి భూమిలో ఉపయోగించాలి.
సుమారు 15, 21 రోజుల పాటు నారుమళ్ళపై 60నుండి 100 గేజ్ మందం కలిగిన పారదర్శక పాలిథీన్ షీట్లను ఉపయోగిస్తూ నేలపై సూర్యర్శ్మి ఉండేటల్లు చూడాలి. ఇందువల్ల కలుపు మొక్కల విత్తనాలు, నులి పురుగులు విశ్రాంతి దశలో్లో ఉండే కీటకాలు, చీడలు చనిపోవటానికి వీలవుతుంది.
మిరపాకాయ తొలుచు పురగుల నివారణ కోసం వే గింజల కషాయం వాడాలి. గుడ్ల సమూమాలను , లార్వా స్ధావరాలను , పెరిగే పిల్ల పురుగులను సేకరించి ధ్వంసం చేయాలి. నియతకాలిక విరామ సమయాల్లో తెగుళ్ల సర్వే స్కౌటింగ్ పని చేపట్టాలి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులకు సంబంధించిన తల్లి పురుగుల సాంద్రతలను పర్యవేక్షించడానికై ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను దీపపు ఎరలను అమర్చుకోవాలి.
వివిధ కీకాలను , చీడలను ఏరుకొని తినేదాన్ని అధికం చేయటడానికై హెక్టారుకు 50 చొప్పిన పక్షి స్ధావరాలను ఏర్పాటు చేసుకోవాలి. శనగ పచ్చ పురుగు కోసం వారం రోజుల వ్యవధిలో ఆరుసార్లు పూత పూసే దశ నుండి హెక్టారుకు 60,000 చొప్పున ఎగ్ పారిసిటాయిడ్స్ ట్రైకోడెర్మా చిలోనిస్ విడుదల చేయాలి. కాయ తొలుచు గుడ్లు , చిన్నచిన్న పురుగులు , రసం పీల్చే చీడల సముదాయాన్ని నివారించడానికై క్రయిసోపెర్లా కార్నియాను విడుదల చేయాలి. శనగపచ్చ పురుగు కోసం హెక్టారుకు 500 ఎల్ .ఇ చొప్పున హెచ్ ఎన్ సి వైరస్ ను చిన్న పొగాకు లద్దె పురుగుల కోసం ఎష్ ఎన్ పివి ని పిచికారి చేయాలి.
COMMENTS