హొగెనక్కల్ జలపాతంలో తడిసిముద్దయిపోదాం!
మనసును పరవశింపచేసే ప్రకృతి అందాలు ఒకవైపు.. నింగి నుంచి జాలువారుతున్నాయా అన్నట్లు జల తరంగాల హోరు మరోవైపు. ఈ సీజన్లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రకృతి అందాల విడిది కేంద్రం హోగెనక్కల్ జలపాతం. ఇక్కడికి చేరుకునేందుకు వేసే ప్రతి అడుగునూ ఝుమ్మనే జలపాతపు శబ్దం సందర్శకులకు సాదరహ ఆహ్వానం కలుకుంది. ఉరకలు వేసే ఆ జలపాతపు అందాలను చూస్తే చాలు అలసట దూరమై మనసు ప్రకృతితో మమేకమైపోతుంది. తెప్పలపై సాహస క్రీడలకు చిరునామా హోగెనక్కల్. అంతటి పేరుగాంచిన ఆ జలపాతపు నీటిలో తడిసిముద్దవుదాం రండి!
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉంది హొగెనక్కల్ జలపాతం. ఇది కావేరీ నది ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి చుట్టుపక్కల ప్రదేశాలు కొంత అందాలను సంతరించుకుంటాయి. ముఖ్యంగా ఇందులో విహరించేందుకు సందర్శకులు ఎక్కువ మక్కువ చూపుతారు. ఇది ఓ పేరు పొందిన సాహస క్రీడగా కూడా పేరుపొందింది. అందుకు స్థానిక మత్స్యకారుల సహాయం చాలా అవసరం. తెప్పలపై అత్యంత సాహసంగా సాగే ఈ క్రీడలో వెదురు బద్దలతో తయారు చేసిన ఒక చిన్న బోటును ఉపయోగిస్తారు. హంపి సందర్శనకు వచ్చిన పర్యాటకులు నదిలో తెప్ప ప్రయాణం చేస్తారు. నదిలో తెప్పపై పయానిస్తూ.. హంపి శిథిలాలను చూడడం అద్భుతమైన అనుభూతి. అలల తాకిడి ఎక్కువగా ఉన్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది. ఇది బెంగళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ సీజన్లో జలపాతం అందాలను చూడడానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. జలపాతం నుండి జాలువారే నీరు రాళ్ళమీద పడినప్పుడు లేచిన నీటి తుంపర్లు పొగలాగా కనిపిస్తుంటుంది. నారసింహుడిని అష్టదిగ్బంధనం చేసిన హనుమంతుడు ఇక్కడే, సందర్శనతో పిల్లకాలువల సమూహం.. ఈ చుట్టు పక్కల నుంచి వచ్చే అనేక పాయలు జలపాతాలుగా దర్శనమిస్తాయి. వీటి సమూహాన్ని మనసారా ఆస్వాదించేందుకు పక్కనే ఉండే హ్యంగింగ్ బ్రిడ్జ్పై ఎక్కాల్సి ఉంటుంది. ఇవన్నీ 250 మీటర్ల ఎత్తు నుండి నేల మీదకు దూకుతుంటాయి.
వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. కొండ వాలులో ప్రవాహవేగం పెరిగి పిల్ల కాలువలతో కలిసి వడివడిగా ముందుకు సాగుతుంది. హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండ చరియల మీదుగా కిందికి జారుతూ జలపాతాల సమూహాన్ని తయారుచేస్తుంది. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. ఈ సాహసం చేసే సమయంలో సందర్శకులు ఒక తెప్పపై వెళుతుంటే, మరో తెప్పపై చిరుతిళ్లు అమ్మే స్థానిక వాటిని పర్యాటకులకు అక్కడే అందిస్తారు. జలపాతంలోని నీరు దక్షిణంగా ప్రవహించి స్టాన్లీ జలాశయంలోకి చేరుతాయి. సుమారు 60 చ.మైళ్లు విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయంపై నిర్మించిన డ్యామ్ ద్వారా జల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. సౌత్ ఇండియా లో జూలై పర్యటన ! కుటీర పరిశ్రమగా ఉపాధి.. అంతేకాదు, ఈ నదిలోని చేపలు భలే రుచిగా ఉంటాయి. అందుకే అక్కడే చేపలు పట్టి, అక్కడే కాల్చి వేడి వేడిగా సందర్శకులకు అందిస్తారు. ఆ రుచిని ఆస్వాదించకుండా ఉండలేం.
ఈ ప్రదేశం మసాజ్కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో చేసే మర్దనతో కీళ్లనొప్పులు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయట. వేలాదిమంది ఈ జలపాతం కింద జలకాలాడుతారు. దానికనుగుణంగా ఇక్కడ వంతెనలు ఏర్పాటు చేశారు. ఇక్కడి స్థానికులకు ఆయుర్వేద తైలాల తయారీ ఓ కుటీర పరిశ్రమగా వారికి ఉపాధిని అందిస్తోంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంతో 180 కి.మీ ఉంటుంది. ఈ ప్రాంతానికి 115 కి.మీ దూరంలో ఉన్న సేలం వరకు రైలు మార్గం ద్వారా వెళ్లి అక్కడి నుంచి టాక్సీలో, బస్సులో హోగెనక్కల్ చేరుకోవచ్చు.
COMMENTS