1 నుంచి టీచర్లకు ఆన్లైన్ హాజరు:
రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో దూరమైన ఆన్లైన్ హాజరు విధానాన్ని పాఠశాల విద్యాశాఖ పునరుద్ధరిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయులంతా వారి సొంత ఫోన్లలోనే ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరును నమోదుచేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వెబ్ఎక్స్ సమావేశంలో స్పష్టంచేశారు. అలాగే చైల్డ్ ఇన్ఫో నమోదు ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఉదయం 10.30గంటలలోపు ఏ ఒక్క విద్యార్థికి హాజరు వేయకపోయినా హెచ్ఎంతోపాటు, ఎంఈవో, డీఈవోలకు షోకాజ్ నోటీసులు వస్తాయని స్పష్టంచేశారు.
ఉపాధ్యాయుల హాజరు
ఉపాధ్యాయులకు వచ్చేనెల నుంచి ఆన్లైన్ హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు కొత్త యాప్ను పాఠశాల విద్యాశాఖ తీసుకురాబోతోంది. ఉదయం పాఠశాల ఆవరణకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ఈ యాప్లోనే హాజరు వేసేలా దీన్ని రూపొందించారు. ఈ యాప్ లోనే అన్ని సెలవులు నమోదుచేయాలి. ఉపాధ్యా యులు తమ సొంత సెల్ఫోన్లో ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకుని, ఆన్లైన్లో హాజరు నమోదు చేయాలి. పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళ వారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే నెలలో నిర్వహించే ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు ఈనెల 28న ఉండే విద్యార్థుల సంఖ్యను ఆధారంగా తీసుకోను న్నారు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబ ద్ధీకరణతో ఏర్పడిన సందిగ్ధత కారణంగా కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సంఖ్యను ప్రామాణికంగ తీసుకోవడంతో చాలా ఉపాధ్యాయ పోస్టులు మిగల నున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఆన్లైన్లో నిర్వహించనున్నందున టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో వివరాలు నమోదు చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో పాఠ్య ప్రణాళిక తయారు చేయలేదని ఏడు గురు ఉపాధ్యాయులకు డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
COMMENTS