ప్రమాదకరమైన మనుషులు నివసిస్తున్న దీవి
North Sentinel island mystery : పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మనిషికి అంతుచిక్కని మిస్టరీ లు ఈ భూమ్మీద ఇంకా మిగిలే ఉన్నాయి. అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మనకు ఈ జన్మ సరిపోదేమో అనిపిస్తోంది.
ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రాచీన యుగం నాటి మనుషులు లాగానే ఇప్పటికీ ఈ భూమ్మీద మనుషులు వెళ్లలేని కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల వారు జీవిస్తూనే ఉన్నారు. ఇటువంటి తెగల్లో అతి ప్రమాదకరమైన తెగగా చెప్పుకునే జాతి సెంటినల్ తెగ.
అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటినెల్ (North Sentinel) తెగ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మానవ రూప ఆదిమ జాతి. వీరు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవరు వెళ్లలేని దీవిలో ఇప్పటికీ నివసిస్తున్నారు. బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వీరు జీవిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఒక పర్యాటకుడు వీరి గురించి తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అక్కడి మనుషులు ఇతన్ని బాణాలతో కొట్టి చంపేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రపంచానికి ఈ తెగ గురించి మరోసారి ప్రపంచానికి తెలిసింది. నార్త్ సెంటినెల్ తెగల గురించి పరిశోధన కోసం వెళ్లినప్పుడు ఇతనికి ఈ ప్రమాదం జరిగింది. ఈ తెగ వారు ఇప్పటికే ప్రపంచానికి దూరంగా ఉండడానికి కారణం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరబల్లి కి ఎలా మొదలైంది అనే విషయాలలో కొంతమంది శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల ద్వారా తెలుసుకొని ప్రపంచానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా వీళ్ళ గురించి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసే సమయంలో వారికి చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ తెగకు చెందిన మనుషులు కొత్తవారిని వారి దీవిలోకి ఎవరిని అడుగుపెట్టనివ్వరు. ఎవరైనా సాహసం చేసి వెళ్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.
1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఈ దీవికి చేరుకున్నారు. ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి ఈ దీని గురించి తెలియకపోవడంతో పోలీసులు దీవి లోకి అడుగుపెట్టగానే వారిపై ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. పోలీసులు ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే వారి శరీరంలోకి చొచ్చుకొనిపోయి వారి శరీరానికి చీల్చే సాయి. అప్పటి నుంచి ఆ దీవి లోనే కాదు ఆ దీవి సమీపంలో ఉండే సముద్ర మార్గంలో వెళ్లాలంటే కూడా మనుషులు భయపడేవారు.
ఈ తెగ పేరుమీదనే ఆ దీవికి కూడా సెంటినల్ అని పేరు పెట్టారు.
రెండవ సారి వీరి గురించి 1974 సంవత్సరంలో ప్రపంచానికి మరొకసారి తెలిసింది. ఒక సినిమా బృందం షూటింగ్ కోసం సెంటినల్ దీవి సమీపానికి వెళ్ళింది. వాళ్లపై ఈ తెగ వారు ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. ఈ సంఘటనతో భయపడిన అక్కడి సినిమా బృందం మొత్తం భయంతో పడవలెక్కి వచ్చేసారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ తెగకు చెందిన మనుషులపై పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు అనుమతి ఇచ్చింది. దాని తరువాత వీళ్ళ పై కూడా ఈ తెగ వారు దాడి చేయడంతో అప్పటి నుండి ప్రభుత్వం కూడా ఇకపై మనుషులు ఈ దీవి లోకి వెళ్ళకూడదు మరియు ఈ దీవి సమీప మార్గంలో ఎవ్వరూ ప్రయాణించకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మనుషులు ఎవరు అడుగుపెట్టకుండా నిషేధాన్ని విధించింది.
2004 లో వచ్చిన భారీ సునామీ కారణంగా ఈ దీవి నీటిలో మునిగి ఉంటుందని, అక్కడ మిగిలి ఉన్న వారికోసం ఆహార పొట్లాలు అందించడానికి ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆ దీనికి పంపించడం జరిగింది. హెలికాప్టర్ చూసిన భయంతో ఈ దీవిలో లేని వారు హెలికాప్టర్ పై బాణాలు విసిరారు. ప్రభుత్వం ఎలా ప్రయత్నించిన కూడా ప్రపంచానికి వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం దొరకలేదు.
సెంటినల్ తెగ ఎక్కడ పుట్టింది. ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నారు.
చరిత్రకారులు చెప్తున్న కథనం ప్రకారం ఈ తెగకు చెందినవారు సుమారు 600 ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. వీరి ఆహార్యం, ఆఫ్రికా లో ఉన్న గిరిజన తెగలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు.
సెంటినల్ తెగ జీవనాధారం వేట. అడవిలోని జంతువులను ఆహారంగా తీసుకుంటారు. వీటితోపాటు అడవుల్లో లభించే పండ్లు, చేపలు, తేనెను ఆహారంగా తీసుకుంటారు. వీరు బాణాలు మరియు విల్లును ఆయుధాలుగా ఉపయోగిస్తారు. మీరు మాట్లాడే భాష అరుపులా లేక కేకలా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ తెగ వారు బాహ్యప్రపంచంలో బ్రతకలేరు. ఎందుకంటే వీరి శరీరం బాహ్య ప్రపచంలో ఉన్నప్పుడు అనేక మార్పులకు గురవుతుంది. దీని వలన వీరి ఆరోగ్యం క్షీణించి పోయే అవకాశం ఉంది.
COMMENTS