పోస్టాఫీస్ స్కీమ్ రూ.35 లక్షలు పొందండిలా
Post Office Scheme Get Rs. 35 lakhs: పోస్టాఫీసు అందిస్తున్న స్కీమ్లలో 'గ్రామ్ సురక్షా స్కీమ్' కూడా ఒకటి. ఈ స్కీమ్లో కేవలం నెలకు రూ.1500ను పెట్టుబడిగా పెట్టి మెచూరిటీ సమయానికి రూ.35 లక్షలు పొందవచ్చు. పెట్టుబడిదారులకు ఈ మొత్తంతో పాటు క్యాష్ బోనస్ కూడా లభిస్తుంది.19 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్న వారు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ పథకం కింద హామీ ఇవ్వబడిన మొత్తం రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కీమ్కి చెందిన ప్రీమియాలను నెలవారీ, త్రైమాసికంగా, అర్థ వార్షికంగా, వార్షికంగా చెల్లించవచ్చు. పెట్టుబడిదారులు ప్రీమియం చెల్లించేందుకు 30 రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది.
మీకు 19 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈ పాలసీని కొనుగోలు చేస్తే.. ప్రతి నెలా రూ.1515ను 55 ఏళ్ల పాటు చెల్లించాలి. ఒకవేళ 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే నెలకు రూ.1463 ను, 60 ఏళ్లకు తీసుకుంటే రూ.1411 ప్రీమియాన్ని చెల్లించాలి. పాలసీ హోల్డర్కి మెచ్యూరిటీ ప్రయోజనం కింద 55 సంవత్సరాలకు రూ.31.60 లక్షలు, 58 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం కింద రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం కింద రూ.34.60 లక్షలు పొందుతారు.ఇందులో పెట్టుబడి పెడితే మీరు రుణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేసిన 4 ఏళ్ల తర్వాత లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం కోసం పోస్టాఫీసును ఆశ్రయించండి లేదా www.postallifeinsurance.gov.in వెబ్ సైట్ చూడండి.
COMMENTS