Lepakshi Temple : గాల్లో వేలాడే స్తంభం .. లేపాక్షిలో ఎన్నో విశిష్టతలు
మన దేశంలోని ఆలయాలకు సుప్రసిద్ధ చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన ఆనవాళ్లు సైతం కనిపిస్తాయి.
ఇందులో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం పలు వైవిధ్యభరితమైన కట్టడాలతో అందరిని ఆకర్షిస్తుంది. దీనికి ఉన్న విశిష్టతల గురించి తెలిస్తే ఔరా అనిపిస్తుంది. హిందూపురం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి గ్రామంలోని ఈ ఆలయం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అవుతుంది. ఇక్కడ వీరభ్ర స్వామి కొలువై ఉంటాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు క్రీ.శ. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
Lepakshi Temple
అయితే ఇక్కడో ప్రత్యేకత ఉంది. గాల్లో వేలాడే స్తంభం ఉండటం మనం చూస్తున్నాం. కానీ దాని గురించి ఇప్పటికే ఎన్ని సర్వేలు చేసినా, పరిశోధనలు సాగించినా అందులోని ఆంతర్యం మాత్రం తెలియరాలేదు. దీంతో దాని గురించి పట్టించుకోవడం లేదు. ఆలయంలో లేపాక్షి నంది విగ్రహం ఉంటుంది. జీవం ఉన్న శిల్పంలా కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలో భారీ రాతితో చెక్కబడిన నంది విగ్రహాన్ని చూస్తే మనకు ముచ్చటేస్తుంది. అంతటి శిల్ప కళా నైపుణ్యం మనకు గోచరిస్తుంది.
ఆలయంలో 70 స్తంభాలు ఉండటం తెలిసిందే. కానీ ఒక్క స్తంభం మాత్రమే గాల్లో తేలియాడుతూ కనిపిస్తుంది. ఇందులోని రహస్యమేమిటో ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు. స్తంభం అడుగు భాగంలో ఖాళీ ప్రదేశమే కనిపిస్తుంది. కానీ స్తంభం మాత్రం కదలదు. దాన్ని కదిలించడానికి బ్రిటిష్ కాలంలో కూడా ప్రయత్నించారట. కానీ వారి వల్ల కూడా కాలేదు. దీంతో ఏం చేయలేకపోయారు. అక్కడికి వచ్చే భక్తులకు ఆ స్తంభం ఆకర్షణగా కనిపిస్తోంది.
Lepakshi Temple
దీనికి కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. భూకంపాలు వంటివి వచ్చినప్పుడు ఆ గాల్లో ఉన్న స్తంభమే మిగతా వాటికి రక్షణగా ఉంటుందని ప్రతీతి. మొత్తానికి లేపాక్షికి ఉన్న ప్రత్యేకత చూస్తుంటే చూడాలనిపిస్తోంది కదూ. ఇంకా రామాయణ కాలంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించే సమయంలో జటాయువు అడ్డు వెళితే దాన్ని తల నరికినప్పుడు ఇక్కడే పడిందని అప్పుడు శ్రీరాముడు దాన్ని లే పక్షి అని పిలిచాడని అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏదిఏమైనా స్థల పురాణ రీత్యా లేపాక్షికి ఎంతో విశిష్టత ఉన్నట్లు గుర్తించక తప్పదు.
COMMENTS